వారసత్వ సంపదను పరిరక్షించుకునేందుకు చర్యలు

-మ్యూజియంల అభివృద్దికి ప్రణాళిక సిద్దం
-మ్యూజియంలను టూరిజం స్పాట్స్ గా ఆదునీకరించనున్నాం..
-మంత్రి ఆర్కే రోజా

ఏపీ సచివాలయంలో టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖా అధికారులతో రాష్ర్ట పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్. కె. రోజా మరియు శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి చరిత్ర మరియు వారసత్వాన్ని పంచుకుంటున్నాయని, అయితే, రాష్ట్రాలు, 2014లో విభజన తర్వాత పురాతన వస్తువులను మార్పిడి చేసుకోలేదని, వీటిలో పురాతన శాసనాలు ఉన్నాయని వాటిలో కొన్ని 200-300 BCE నాటివి వున్నాయని మంత్రి తెలిపారు.

విభజన తర్వాత రెండు రాష్ట్రాల పురావస్తు శాఖలు విలువైన పురాతన వస్తువుల జాబితా ద్వారా.. ఆంద్రప్రదేశ్ రాష్ర్టానికి చెందవల్సిన పురావస్తు సంపదను రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వున్న మ్యూజియంలను అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, డిపిఆర్ తయారు చేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మ్యూజియంలన్ని టూరిజం అట్రాక్షన్ స్పాట్స్ గా తయారు చేయాలని, ఆధునీకరించాలని మంత్రి అదికారులకు ఆదేశించారు. పిపిపి ద్వారా మ్యూజియాల అభివృద్ది చేయాలనే ప్రతిపాదనలను ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ అధికారులతో మంత్రి చర్చించారు.

జగనన్న స్పోర్ట్ కిట్స్, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అంశాలపై మంత్రి మరియు శాప్ ఛైర్మన్ శ్రీ భైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి అధికారులతో చర్చించారు. పాఠశాలల్లో విద్యార్ధులకు క్రీడలపై అవగాహనా కార్యక్రమాలను శాప్ ద్వారా చేపట్టాలని, కల్చరల్ యాక్టవిటీస్ కి ఆదరణ కల్పించే కార్యక్రమాలను రూపోందించాలని మంత్రి ఆదికారులకు సూచించారు. ప్రసాద్ స్కీం కింద ఒంటిమిట్ట నంద్యాలలో టెంపుల్ టూరిజం, ట్రైబల్ మ్యూజియం అభివృద్ధి, కేరళ తరహాలో కోనసీమ బ్యాక్ వాటర్ ల్లో బోట్ హౌజ్ ల ఏర్పాటు చేసి తద్వారా పర్యాటకులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో YATC శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఐఏఎస్, విసి & ఎండీ కన్నబాబు ఐఏఎస్, కమిషనర్ అర్కియాలజీ, స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసులు ప్రిన్సిపల్ సెక్రెటరీ డా.జి. వాణి మోహన్ ఐఏఎస్ మరియు ఇతర అధికారులు పాల్గోన్నారు.

Leave a Reply