Suryaa.co.in

Andhra Pradesh

నీటి తొట్టిలో పడి 4 ఏళ్ల బాలుడి మృతి

ఏలూరు : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో ఓ బాలుడు నీటితొట్టెలో పడి మృతి చెందిన విషాద సంఘటన జరిగింది. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడులో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి గ్రామానికి చెందిన తానిగడప భాష. లత దంపతులకు జాన్ భూషణ్( 4) ఇంట్లో ఎవరిపనిలో వారుండగా చిన్నారి బాలుడు ఆడుకుంటూ తొట్టె లోకి జారాడు. ఆతరువాత నీట మునిగి ఊపిరాడక మృతి చెందాడు. పిల్లాడు కనిపించకపోయేసరికి పరిసరాలు వెదుకుతున్న తల్లితండ్రులకు తొట్టెలో తేలి ఉన్న బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడ్ని స్థానిక పిహెచ్సికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

LEAVE A RESPONSE