– మైదానాలను తలపిస్తున్న చెరువులు
నీటి నిర్వహణలో రాష్ట్రము పురోగతి సాధిస్తున్నప్పటికీ,ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ సమగ్ర నీటి నిర్వహణ సూచిక 2022 ప్రకారం, భారతదేశ నీటి సవాళ్లను తగినంతగా ఎదుర్కోవడానికి అవసరమైన దాని కంటే మొత్తం పనితీరు చాలా తక్కువగా ఉంది. రాష్ట్రాలు నీటి నిర్వహణ పద్ధతులను మెరుగుపరచాలి, తద్వారా దేశం తన పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించగలదని, ఆర్థిక వృద్ధికి తోడ్పడే దాని పర్యావరణ వ్యవస్థను నిలబెట్టుకోవచ్చని నివేదిక పేర్కొంది.
చెరువులు, తలపిర్లు, ఊటలు కుంటల, నీటి నిల్వలు, వాటర్ బాడీస్ పటిష్టతకు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం మూలంగా రాబోయే రోజులల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముంది. చెరువులు మరమత్తులు చేయక, మరి కొన్ని చెరువులు కబ్జాకు గురైన, చెరువులో కట్టడాలు, గుర్రపు డెక్క, కంపచెట్లుతో కప్పబడినా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. పూర్వకాలంలో గ్రామీణ వ్యవసాయ వ్యవస్థలో సాగునీటిని అందించే ఈ చెరువులు కాస్తా కాలగర్భంలో కలసిపోయాయి.
కొన్ని ఆక్రమణలో చెరలో చిక్కుకుంటే, మరి కొన్ని అన్యాక్రాంతమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలో చెరువులు అంతరించిపోవడంతో కొద్దిపాటి వర్షానికే లోతట్టు, పల్లపు ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. దీంతో వేలాది ఎకరాలు ముంపు బారినపడి కోట్ల విలువైన పంట నష్టాన్ని చవిచూడవలసిన దుస్థితి దాపురించింది. చెరువులో, సప్ప్లై ఛానెల్స్, సూయజ్ లో ఇసుక తోడడంతో చెరువు పైకి పోయి సప్ప్లై ఛానెల్ కిందికి వెళ్లి వర్షాలు పడిన సందర్భాలలో గ్రామాలు పట్టణాలలోకి, చెరువు పరివాహక ప్రాంతాలలో నీరు చేరుతుంది.
చాలా చెరువులలో ప్రార్థన మందిరాలు, అక్రమ కట్టడాలు, నివాస ప్రాంతాలుగా వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. చెరువులు కుంటలు తలపిర్లు ఊటలు పునరుద్దరించుకుంటే జిల్లాలో ఇరవై టిఎంసి నీరు వడిసిపట్టుకోవచ్చని నీటిపారుదల నిపుణుల అంచనా వేశారు. జిల్లాలో నీటి యాజమాన్య పద్ధతులు పూర్తిగా సన్నగిల్లాయి. చెరువులపై అలాగే నీటి సంరక్షణ వినియోగం పై అవగాహన ఉన్న అధికారులు కరువయ్యారు.
ఇప్పుడున్న అరకొర అధికారులు కనీస అవగాహన లేకపోవడం చెరువు సామర్థ్యం తెలియదు, చెరువు కింద సేద్యం అంతకంటే తెలియని పరిస్థితి. చెరువుకు ఇన్ ఫ్లో ఎంత ఉంది, చెరువు అవుట్ ఫ్లో ఎంత ఉంది, నిల్వ సామర్థ్యం ఎంత అనే ప్రాథమిక జ్ఞానం లేకపోవడం తో రైతులు, లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. 16 జిల్లాల్లో ఇప్పటికీ ఇండెక్స్లో 50 పాయింట్ల కంటే తక్కువ స్కోర్ను (100లో) కలిగి ఉన్నాయి మరియు తక్కువ-పనితీరు విభాగంలోకి వస్తాయి. పల్లపు ప్రాంతాలలో చిన్నచిన్న కుంటలు లేదా చెక్ డ్యాంలు, ఊట చెరువులు నిర్మించి, ఎత్తు ప్రదేశాల నుంచి వచ్చే నీటిని వృధా పోకుండా అడ్డగిస్తే ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జల నిలువ పెరగడమే కాక ఎక్కువైన నీరు పంట పొలాల్లో ఉపయోగపడుతుంది.
వీలైనంత వరకు నీటి పరిగ్రహణ . శక్తికి మించి వచ్చిన వర్షపు నీటిని నీటి కాలువల ద్వారా, గ్రేడెడ్ గట్ల ద్వారా నీటి గుంటలోని మళ్ళించాలి. నీటి గుంటలలో నిలువ ఉంచిన నీరు పంటలకు బెట్ట తగిలినప్పుడు, కూరగాయల సాగు పెంచుకోవడానికి మేలైన నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సండ్ల చెట్ల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. పెట్టుబడి తక్కువ ఉన్న రైతు సోదరులు, నీటి గుంటలు, ఉట చెరువులుగా కూడా మార్చుకొని, తమ భూ నీటి వనరులను పెంచుకోవచ్చు. ఇటువంటి చర్యలు నీటి పరివాహక ప్రాంతం ప్రాతిపదికపై చేపట్టాలి. అవసరమైన వనరులు వ్యవసాయ శాఖ ద్వారా గానీ లేక బ్యాంకుల ద్వారా కానీ సమకూర్చుకోవాలి.
ట్యాంకుల సామర్థ్యాన్ని పెంచడానికి అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి భూగర్భ జలాల పునరుద్ధరణ సానుకూల ప్రభావం చూపడం, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మంచి నీటిపారుదల పై ఆధారపడిన కరువు పీడిత ప్రాంతాలలో. చాలా ట్యాంకులు భూగర్భ జలాలు రీఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, చిన్నగా ఉండే పెర్కొలేషన్ ట్యాంక్ పొడి కాలంలో భూగర్భ జలాశయాల్లో నీరు చేసేలా చేస్తాయి. ఇటీవలి అధ్యయనం ఉపరితల ట్యాంక్ నీరు అలాగే భూగర్భ జలాల మధ్య బలమైన సంబంధాన్ని ఆవిష్కరించింది.
ట్యాంకుల సాంద్రత ఎక్కువగా ఉన్న మందలాలల్లో, భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చే లోతు తగ్గుతుంది (ఉపరితలం నుండి కొలిచేటప్పుడు) భూగర్భజల స్థాయిలను రీఛార్జ్ చేయడంలో ట్యాంకుల సానుకూల ప్రభావాలు సూచిస్తుందని నిపుణులు అంటున్నారు . అవి విడదీయరాని అనుబంధం ఉన్నందున, హైడ్రోలాజికల్ బ్యాలెన్స్ను నిర్వహించడానికి ప్రత్యామ్నాయాలకు విరుద్ధంగా ట్యాంక్ బావి నీటిపారుదల ఒకదానికొకటి పరిపూరకరమైన గా చూడాలని నీటిపారుదల నిపుణులు సెలవిస్తున్నారు. రెండు నీటిపారుదల పద్ధతులను కలిపి ఉపయోగించడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వాటిని వాటర్షెడ్ లేదా నదీ పరీవాహక ప్రాంతంలో నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాంక్ నీటిపారుదల వల్ల భూమి ఉన్న రైతులు అలాగే బోరు బావులు ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది నీటిపారుదల కింద పెద్ద విస్తీర్ణం ఎక్కువ పంటలు ఉత్పత్తి చేయడం తో, “వ్యవసాయ కార్యకలాపాలు సంవత్సరంలో ఎక్కువ కాలం కొనసాగుతాయి, దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు పని చేయాల్సి ఉంటుంది, భూమిలేని కార్మికుల కుటుంబాలకు మరింత ఉపాధి అవసరం. ట్యాంక్ నీటిపారుదల క్షీణత సాధారణంగా గ్రామస్తులు నిర్మించబడిన మరియు నిర్వహించబడే ట్యాంకులు, 100 హెక్టార్ల పంట భూములు సాగు నీరు అందించడానికి తగినంత నీటిని కలిగి ఉండే నీటి వనరులు.
ఈ పురాతన నీటి సేకరణ పద్ధతి, ట్యాంకులు రుతుపవన వర్షపు నీటిని సేకరించి నిల్వ చేస్తాయి, ఇది వేసవి కాలంలో త్రాగడానికి రక్షిత నీటి పారుదల కోసం ఉపయోగించబడుతుంది. “నీటిపారుదల నీరు కాలువల పంపిణీ వ్యవస్థ ద్వారా పంటలకు సరఫరా చేయబడుతుంది. గత దశాబ్దాలుగా, నీటిపారుదలలో వాటి వినియోగం గణనీయంగా తగ్గింది. దేశంలో అత్యధికంగా 35 శాతం ట్యాంకులు వినియోగంలో ఆంధ్రాలో ఉంది. ప్రాంతీయంగా, గత పది సంవత్సరాలుగా చెరువులు నీటిపారుదల ప్రాంతంలో స్థిరమైన తగ్గుదలని నివేదికలు సూచిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా కురిసిన అధిక వర్షాలు వినియోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలో అధికారులు ఉన్నారు.
నీటి యాజమాన్య పద్ధతులు సరిగా లేకపోవడంతో నీరు వృథా అవుతున్నది. ఈ సంవత్సరం చెరువులకు నీరందలేదు, చెరువులను అనుసంధానం చేస్తున్న కాలువలలో కంపచెట్లు ముళ్ల పొదలు బండరాళ్లు ఉన్నాయి. కరువు పనులకు వీటిని అనుసంధానం చేసి కాలువలు శుభ్రం చేస్తే పడిన అరకొర వర్షపు నీటితో నీరు నిల్వ ఉంచవచ్చు. రాత్రివేళల, తెల్లవారుఝామున లారీలు, ట్రాక్టర్లలో తరలించి విక్రయిస్తున్నారు.
పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. కృత్రిమ ఇసుక తయారీని కట్టడి చేయడానికి అధికారులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి. పామిడి, కల్లూరు, ఇల్లూరు, తరిమెల ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. మరో వైపు పెన్నా నదిలో ఇటుక బట్టీలు, వర్మీ కంపోస్ట్, చెత్త నుండి సంపద కేంద్రాలు, కంప చెట్లు, దురాక్రమణలు, అక్రమ కట్టడాలు ఉన్నా అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు. రజాపురం, మారనంపల్లి, పెద్దొడ్డి, కొజ్జెపల్లి, తదితర గ్రామాల మీదుగా మరోవైపు పెద్ద వంక ప్రవహిస్తుంది.
గత సంవత్సరం కురిసిన వర్షాలతో వరద ఉదృతికి వంకలు, వాగులో ఇసుక మేట వేసింది. వాగులో ఇసుకను తవ్వి తరలించడమే కాకుండా, పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో నిల్వ చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కి రూ.500 నుంచి రూ.2వేల వరకు ముడుపులు చెల్లిస్తున్నట్టు తెలిసింది.
ఈ తతంగమంతా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ మైనింగ్, భూగర్భ జలశాఖ, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధుల అండతోనే వ్యాపారులు కృత్రిమ ఇసుక దందాను సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతల కనుసైగల్లోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్టు తెలిసింది.
