Suryaa.co.in

Andhra Pradesh

పనిలో వేగం పెంచుదాం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపు

విజయవాడ…పనిలో వేగం పెంచుదాం…రాష్ట్ర రాజకీయాలు బిజెపికి అనుకూలంగా మలచుకోవలసిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నొక్కి వక్కాణించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పదాదికారుల సమావేశం జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సోమువీర్రాజు మాట్లాడుతూ ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క బిజెపికి మాత్రమే ఉందన్నారు.ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివ్రుద్ది పనులను ప్రజల్లోకితీసుకువెళ్లాలన్నారు.గ్రామ పంచాయితీలకు కేంద్రం ఇస్తున్న నిధులు మినహా రాష్ట్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.

జాతీయ స్ధాయిలో రహదారులు, ఎయిర్ పోర్టులు నిర్మాణం వంటివి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివ్రుద్ది చేస్తోంది ఈ కారణంగా రవాణా రంగం వల్ల జాతీయ స్ధాయిలో మెరుగుపడిందన్నారు. కేవలం బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే దేశం అభివ్రుద్ది వైపు దూసుకుని వెళుతోందని అందుకు అనుగుణంగా బిజెపి ప్రజల్లో బలోపేతం అవుతోందన్నారు అయితే కార్యకర్తలు ఈ కార్యక్రమాలకు అనుసంధాన కర్తలు గా మారాలని ఉద్భోదించారు.

పోలింగ్ బూత్ కమిటీలు వేయడం ద్వారా ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాలను పోలింగ్ బూత్ స్ధాయిలో ఏర్పాటు చేయాలన్నారు. బిజెపి కి ప్రధాని ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. క్షేత్ర స్ధాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రశివన్నారాయణ, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం తదితరులు మాట్లాడారు.

LEAVE A RESPONSE