రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్ కు అద్దం పట్టిన బడ్జెట్

– కేంద్ర ప్రభుత్వం ప్రవేశఫెట్టిన 2022-23 బడ్జెట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విప్లవాత్మకం… రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్ కు అద్దం పట్టిన బడ్జెట్. స్వదేశీ వ్యాక్సిన్ తో కరోనాను కట్టడి చేసిన మోదీ ప్రభుత్వం…. ‘ఆత్మ నిర్భర్’ వ్యాక్సిన్ తో ఆర్దిక సుస్థిరత సాధించడం చారిత్రాత్మకం. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం మోపకుండా పన్నుల రహిత బడ్జెట్ ను రూపొందించడం సాహసోపేతం. ఎన్నికల రాజకీయాలతో పనిలేకుండా దేశహితమే లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యాలతో రూపొందించిన బడ్జెట్ ఇది.ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలతో కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నయ్.

ఇంతటి సాహసోపేత బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నా సెల్యూట్. అన్ని రంగాలను సమ దృష్టితో చూడటం కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ వీటిని సునాయసంగా అధిగమిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించడం గర్వకారణం.

Leave a Reply