Suryaa.co.in

Telangana

తెలంగాణ గుండె ఉప్పొంగిన రోజు

– పీవీ నరసింహారావు ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గుర్తించి గౌరవించింది

“మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల అభినందిస్తూ తెలంగాణ శాసనమండలిలో గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనమండలి

తెలంగాణ బిడ్డ , అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు , మాజీ ప్రధానికి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఈరోజు తెలంగాణ గుండె ఉప్పొంగింది అని శాసనమండలిలో డిప్యూటీ స్పీకర్ ఆర్థిక, శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్థలు పీవీ తీసుకొచ్చారు. భారతదేశ వ్యాప్తంగా భూసంస్కరణలు అమలు కాగా వాటిని అమలు చేసిన గొప్ప సామ్యవాది, ప్రగతి శీలుడు పివి అని పొగిడారు.

దేశంలో మొదటిసారి ప్రారంభించిన హ్యూమన్ రిసోర్స్ మంత్రిగా ఆయన పెను మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. పీవీ పార్లమెంటు సభ్యుడు కాకపోయిన ఈ దేశాన్ని పాలించే అవకాశాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆయనకు కల్పించిందని అందుకు జాతీయ కాంగ్రెస్కు కృతజ్ఞతలు తెలిపారు. బంగారం తాకట్టు పెట్టి అతలాకుతలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహనీయుడు, సరళీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని అన్నారు.

తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను పివి నరసింహారావు ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు తో పాటు ఎల్కే అద్వానీ ఎమ్మెస్ స్వామినాథన్ కర్పూర సింగ్ ఠాకూర్ తదితరులకు భారతరత్న ప్రకటించడం గర్వించదగిన విషయం అన్నారు

LEAVE A RESPONSE