Suryaa.co.in

Telangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు

-భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. దీంతో పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A RESPONSE