Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ వాళ్లను ‘మన సభ్యులు’ అని గౌరవంగా మాట్లాడటం ఏమిటి?

వైసీపీవాళ్లను మన సభ్యులు అన్నప్పుడే స్పీకర్ పై ఉన్న గౌరవం పోయింది
టీడీపీ వాయిదా తీర్మానం చదివే స్థితిలో కూడా స్పీకర్ లేడు
మేం మాట్లాడుతుంటే మైకులు ఆపేస్తారు..ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రం గంటల తరబడి అవకాశమిస్తారు
నాలుగున్నరేళ్లుగా ఇదే తంతు
స్పీకర్ వైఖరి… అధికారపక్షం తీరును నిరసిస్తూ ఈ సమావేశాలు ముగిసేవరకు ఉభయసభల్ని టీడీపీ బహిష్కరిస్తోంది
– సస్పెన్షన్ తర్వాత మీడియా ప్రతినిధులతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

“టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం చాలా స్పష్టంగా ఉంది. ప్రధానప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఒక్క అక్షరం పొల్లుపోకుండా చదవాల్సిన స్పీకర్ దాన్ని పక్కన పెట్టడం నిజంగా బాధాకరం. చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమకేసులు వెంటనే ఎత్తి వేయాలి.. ఆయన విషయంలో తప్పు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ మేం తీర్మానం ఇవ్వడం జరిగింది. మా తీర్మానంపై చర్చిస్తామని చెబుతున్నవారు గతంలో శాసనసభలో చర్చలు ఎలా జరి గాయో, ఒక్కసారి గుర్తుచేసుకుంటే మంచిది.

నాలుగున్నరేళ్ల నుంచి చట్టసభల్లో కూడా టీడీపీ.. చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తి పోయడం తప్ప, ఏనాడైనా ఈ ప్రభుత్వం ప్రజాసమస్యలపై చర్చించిందా?
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల, వైసీపీ శాసన సభ్యుడిగా పనిచేయడం వల్ల అధికారపక్షానిది పైచేయి అవుతోంది తప్ప నాలుగున్నరే ళ్లలో ఎప్పుడూ ప్రతిపక్షానికి అవకాశమివ్వలేదు. మేం మాట్లాడకుండా చేసి, వాళ్లు మాత్రం సినిమాలు చూపిస్తుంటారు. చాలా సందర్భాల్లో చెప్పాం.. మీరు చూపించే సిని మాలకంటే మేం చూపించే సినిమాలు ప్రజలకు చూపిస్తే వాస్తవాలు తెలుస్తాయని. ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడూ టీడీపీప్రభుత్వం చేసిన పనులపై, చంద్రబాబునా యుడిపై దుమ్మెత్తి పోయడం తప్ప ఏనాడూ అర్థవంతంగా చర్చ జరిపింది లేదు.

మేం వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తే మా మైకులు ఆపేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినప్ప టినుంచీ ఇదే జరుగుతోంది. ఈ ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ముందు చంద్రబాబుపై పెట్టి న అక్రమ కేసులు ఎత్తివేసి, చేసిన తప్పుకి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అది చేశాక ప్రత్యేకంగా ఒక ఐదురోజులు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, అచ్చం అవినీ తిపైనే చర్చిద్దాం. ఆ సమావేశాల్లో జగన్ రెడ్డి చేసిన అవినీతి..ఆయనపై ఉన్న కేసులు.. న్యాయస్థానాల్లో ఎదుర్కొంటున్న విచారణ తీరుతో పాటు, ఈ ప్రభుత్వం కక్ష తో చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులపై కూడా చర్చిద్దాం.

ఈ విధంగా జరిగే సమా వేశాలను స్థానిక, జాతీయ మీడియాకు ప్రత్యక్షప్రసారం చేసే అవకాశం కల్పిద్దాం. అప్పుడు ఎవరి బాగోతం ఏమిటో ప్రజలకు కూడా అర్థమవుతోంది. ముందు ప్రభుత్వం ఈపనిచేస్తే తాము అన్నిఅంశాలపై ఎన్నిరోజులైనా చర్చించడానికి సిద్ధమే. అవసరమై తే ఈవిధంగా నిర్వహించే ప్రత్యేక సమావేశాలకు మా నాయకుడిని కూడా తీసుకొస్తాం. సభలో అడుగుపెట్టనని ఆయన గతంలోనే చెప్పారు..కానీ మేం ఆయన్ని ఒప్పించి తీసుకొస్తాం. మేం చేసిన ప్రతిపాదనకు అధికారపార్టీ సిద్ధమేనా అని ప్రశ్నిస్తున్నాం.

మమ్మల్ని యూజ్ లెస్ ఫెలోస్ అని.. వైసీపీవాళ్లను మన సభ్యులు అన్నప్పుడే స్పీకర్ పై ఉన్న గౌరవం పోయింది
శాసనసభను వైసీపీ కార్యాలయం కంటే దారుణంగా మార్చిన ఘనత ఈస్పీకర్ దే. మమ్మల్ని ‘యూజ్ లెస్ ఫెలోస్’ అన్నారు.. మమ్మల్ని అలా తిట్టిన వ్యక్తి చెప్పేది మేం ఎందుకు వినాలి. అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు, ఆ స్థానం విలు వను ఎలా కాపాడాలోకూడా తెలియకపోతే ఎలా? మమ్మల్ని యూజ్ లెస్ ఫెలోస్ అని వైసీపీ వాళ్లను ‘మన సభ్యులు’ అని గౌరవంగా మాట్లాడటం ఏమిటి? తన వ్యాఖ్యలతో స్పీకర్ స్థానాన్నే ఆయన అగౌరవపరిచారు.

సాక్షి సిబ్బందిని సభలోకి అనుమతించి, మేం మాట్లాడేది మాత్రమేచూపిస్తూ.. అధికారపక్ష సభ్యులు వేసే వీరంగం ప్రజలకు తెలియకుండా చేస్తుంటే మేం వీడియోలు తీయక ఏంచేయాలి? సభలోజరిగేవి ప్రజలకు తెలియకుండా స్పీకర్ కట్టడి చేస్తున్నాడు కాబట్టే..మేం సెల్ ఫోన్లలో వీడియాలు తీశాం.

మేం వీడియోలు తీశామంటున్నారు… వీళ్లకు నచ్చినట్టు చేస్తుంటే మేం వీడియోలు తీయక ఏం చేయాలి? మేం 17 మందిమి ఉంటే, మా చుట్టూ 200మంది మార్షల్స్ ను పెట్టారు. మా చుట్టూ గోడకట్టినట్టు మార్షల్స్ నిలబడితే, స్పీకర్ ఏం చేస్తున్నాడో.. అధికారపార్టీ సభ్యులు ఏంచేస్తున్నారో మాకెలా తెలుస్తుంది? వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.. మంత్రులు స్పీకర్ కు సైగలు చేయవచ్చు.. మేం మాత్రం నోరెత్తకూడదు? సాక్షి టీవీ ప్రసారాలకోసం ఆ ఛానెల్ సిబ్బందిని సభలోనే ఉంచు తున్నారు. మేం చేసేవి మాత్రమే సాక్షిటీవీలో వస్తాయి… వాళ్లు చేసేవి రావు. ఒక్క ఛానల్ ను మాత్రమే సభలోనికి ఎలా అనుమతిస్తారు?

మీడియా అంటే సాక్షి పత్రిక.. సాక్షి ఛానల్ మాత్రమేనా? ధైర్యముంటే శాసనసభలో జరిగే ప్రతి పరిణామాలను నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం చేయగలరా? మేం మాట్లాడేటప్పుడు బయటికి తెలియకుండా ప్రకటనలు ప్రసారం చేస్తారు.. వాళ్లు మమ్మల్ని తిట్టేది మాత్రం ఆపకుండా ప్రసారం చేస్తారు. శాసనసభలో జరిగేది సభ్యస సమాజానికి తెలియకుండా స్పీకర్ నియంత్రిస్తున్నాడు కాబట్టే..మేం సెల్ ఫోన్లలో వీడి యాలో తీశాం.

దానికే ఏదో మేం హత్యాయత్నం చేసినంతగా భావించి, మాపై కక్షతో సభాపతి వ్యవహరించాడు. మేం ఎప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాం. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు, శాసనసభ ముసుగులో ఇష్టానుసారం రెచ్చిపోతుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? మేం ఇచ్చిన వాయిదా తీర్మానం చదవడానికి కూడా స్పీకర్ నోరు తెరవనందునే మేం సభను బాయ్ కాట్ చేసి బయటకు వచ్చాం.

ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీ శాసనసభ్యులు, మండలి సభ్యులు ఉభయ సభలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై చర్చిస్తామంటున్నారు.. గత పదిరోజుల నుంచీ ఆ ప్రాజెక్ట్ పై ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో… వాస్తవాలు ఎలా తొక్కిపెట్టి చంద్రబాబుని తప్పుడు మనిషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా! మంత్రులు, ప్రభుత్వం, సీఐడీ అధికారులు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం.

శాసనసభలో జరుగుతున్న పరిణామాలకు కలతచెంది, అధికారపార్టీ సభ్యుల వైఖరిని నిరసిస్తూ ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీశాసనసభ్యులు, మండలి సభ్యులు ఉభయసభలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ యొక్క వాస్తవాలు ప్రజలకు తెలియచేయడానికి మేం ఇప్పటికే అన్ని అధారాలను… వాస్తవాలను ప్రజల ముందు ఉంచాం.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.

LEAVE A RESPONSE