Suryaa.co.in

Andhra Pradesh

ఈ నెల 26 వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కాకుండా పొడిగించాలని బీఏసీ సమావేశంలో టీడీపీ కోరగా అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ఆరు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్, మంత్రులు బుగ్గన, అనిల్, కన్నబాబు హాజరయ్యారు.
ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.

LEAVE A RESPONSE