Suryaa.co.in

Andhra Pradesh

విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ తల్లిదండ్రులకు ఏపీ పోలీసుల నోటీసులు

విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ తల్లిదండ్రులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పీవీ.రమేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు.

ramesg-ips
pic courtesy: etv andhrapradesh

విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ తల్లిదండ్రులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని సుబ్బారావు, మణి ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు.. నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ పటమట పీఎస్‌లో విచారణకు
రావాలని స్పష్టం చేశారు. 2018లో నమోదైన గృహహింస కేసుకు సంబంధించి తమ ముందు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పీవీ రమేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు సంబంధంలేని కేసులో ఇరికిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

LEAVE A RESPONSE