– 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు
– 10 మంది సురక్షితంగా బయటికి
ఉత్తరాఖండ్లో ఉదయం పెను ప్రమాదం చోటు చేసుకుంది.. కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో చరియలు విరిగి పడ్డాయి, చమోలీ జిల్లాలో మంచు కొండ కుప్ప కూలింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకు పోయారు. అందులో 10 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకు వచ్చారు. మరో 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది.
రంగం లోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చమోలీ జిల్లా లోని చమోలీ-బద్రీనాథ్ జాతీయ రహదారిపై మన గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణ కార్మికులు తమ పనిలో నిమగ్నం కాగా.. ఒక్కసారిగా మంచు కొండ విరిగి పడింది. దీంతో, మంచు శిథిలాల కింద.. కార్మికులు అంతా చిక్కుకు పోయారు.
ప్రమాద సమాచారం తెలియగానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-ఎస్డీ ఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-ఎన్డీ ఆర్ఎఫ్, చమోలీ జిల్లా అధికార యంత్రాంగం, ఇండో- టిబెటన్ బోర్డర్ ఫోర్స్-ఐటీబీపీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-బీఆర్ఓ బృందాలు హుటాహుటిన రంగం లోకి దిగి రిస్క్టింగ్ టీం.. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.