బండి సంజయ్… కంటి వెలుగు పథకంలో కళ్ళ పరీక్ష చేసుకుంటే మంచిది

-బండి సంజయ్ కు వ్యవసాయం గురించి కరెంటు గురించి ఏం తెలుసు?
-దేశ సంపదను ఇద్దరు గుజారాతీ లు మరో గుజారాతీ కి అప్పగించే ప్రయత్నాలు
విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది
– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రెస్ మీట్

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏమన్నారంటే..బీ ఆర్ ఎస్ మొదటి సభ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.సభను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు.మాకు మార్గదర్శనం చేసిన మంత్రి హరీష్ రావు కి ప్రత్యేక అభినందనలు.ఖమ్మం ప్రజాప్రతినిధులకు, సభకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలుఅందరి సమన్వయం తో సభ జయప్రదమైంది.ఖమ్మం చరిత్ర లో ఇంతటి సభ ఎపుడూ జరగలేదు.సభకు వచ్చిన ఇతర రాష్ట్రాల సీఎం లు మాజీ సీఎం ,నేతలకు ధన్యవాదాలు.మాకు సంక్రాంతి 18 న జరిగింది అనిపించింది. మీడియా కు ధన్యవాదాలు.

ఈ సభ ద్వారా సీఎం కేసీఆర్, మిగతా నేతలు దేశానికి దిశా నిర్దేశం చేశారు.ఈ సభ ను కేవలం పది రోజుల వ్యవధి లో విజయవంతం చేశాము.ఈ సభ ఖమ్మం లో జరగడం మా అదృష్టం.ఖమ్మం జిల్లాకు నిధుల వరద పారించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఖమ్మం అభివృద్ధికి గుమ్మం లా మారింది.కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీ లు అవసరం లేదు.. వాళ్ళ నేతలే చాలు.సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకం లో కళ్ళ పరీక్ష చేసుకుంటే మంచిది.. లేదంటే మేమే ఓ టీం ను పంపిస్తాం.బండి సంజయ్ కు 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకోవాలి.సభ తో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయి.

రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమన్నారంటే..
ఖమ్మం సభ మరచిపోలేని సభ, కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన సభ.ఈ సభ పాత్ర దారులు, సూత్ర దారులకు శిరస్సు వహించి నమస్కరిస్తున్నాం.కరీంనగర్ సభ 2001 లో తెలంగాణ ఏర్పాటు కు బాటలు వేసినట్టే ఖమ్మం సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది కానుంది.ప్రగతి శీల శక్తుల కలయిక కు ఖమ్మం సభ బాటలు వేసింది.ఎవరేమనుకున్నా ఖమ్మం సభ చాలా పద్దతిగా జరిగింది.దేశ సంపదను ఇద్దరు గుజారాతీ లు మరో గుజారాతీ కి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ ఆటలు చెల్లవు గాక చెల్లవు అని ఖమ్మం సభ సందేశం ఇచ్చింది.ఖమ్మం సభ విజయాల పరంపర ను నమోదు చేసుకుంది.తెలంగాణ లో ఉచిత విద్యుత్ ను ఇస్తున్నట్టే దేశ వ్యాప్తంగా ఇస్తాం.విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది దీన్ని కూడా ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తాం.రైతుల ఆందోళనలకు బీ ఆర్ ఎస్ మద్దతు ఇస్తుంది.ఖమ్మం సభ ఆరంభం మాత్రమే.

ఢిల్లీ రాజకీయాల్లో బీ ఆర్ ఎస్ కచ్చితమైన మార్పు దిశగా అడుగులు వేస్తుంది.2014 లో ధనవంతుల జాబితాలో ఆదానీ ది 604 ర్యాంకు.. ఇపుడు మొదటి స్థానానికి ఎలా ఎగబాకారు.. బీజేపీ నేతలు చెప్పాలి.ఆధారాలు లేకుండా అవినీతి పై ఆరోపణలు చేసే వారి గురించి మాట్లాడలేము. బండి సంజయ్ కు వ్యవసాయం గురించి కరెంటు గురించి ఏం తెలుసు?

ఎంపీ వద్ధి రాజు రవి చంద్ర ఏమన్నారంటే…..
అడగ్గానే మాకు ఖమ్మం లో బీ ఆర్ ఎస్ సభ పెట్టేందుకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు.సభ లో ఎంత మంది జనాలు ఉన్నారో బయట అంతమంది జనాలు ఉన్నారు.బీ ఆర్ ఎస్ ప్రబలమైన శక్తిగా మారడానికి ఖమ్మం సభ బాటలు వేయబోతోంది.ఖమ్మం సభ తో బీజేపీ కి జిల్లాలో స్థానం లేదని తేలిపోయింది.బీజేపీ కి ఖమ్మం లో డిపాజిట్లు కూడా రావు. ఖమ్మం లో బీ ఆర్ ఎస్ పదికి పది స్థానాలు రావడం ఖాయం.

Leave a Reply