– సోషల్ రిఫార్మిస్టు
రవీంద్రభారతిలో జరిగిన శ్రీ మహాత్మా బసవేశ్వర 892 జయంతోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: సమాజ పరివర్తన కోసం తన జీవితాన్ని అర్పితం చేసిన శ్రీ మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది. దేశంలో ఉన్న అనేక రుగ్మతల పై పోరాటం చేసి సమ సమాజ స్థాపన జరగాలని కుల మతాలకతీతంగా మనుషులంతా ఒకటేనని 12వ శతాబ్దంలోనే చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు.
బసవేశ్వరుడిని మతతత్వవేత్తగా చూడటం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు. బసవేశ్వరుడు మతతత్వవేత్త కంటే సోషల్ రిఫార్మిస్టు. సామాజిక పరివర్తన కోసం తన జీవితాన్ని అర్పితం చేసిన గొప్ప నాయకుడు.
సమ సమాజ స్థాపన కోసం పనిచేయడమే కాదు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పారు పనిని దైవత్వంగా చూస్తూ పనిచేయాలని చెప్పిన గొప్పవాడు అంతే కాకుండా శ్రమే సౌందర్యం అన్నాడు. సమాజంలో ఉన్న అందరు సమానంగా బతకాలి సమాన అవకాశాలు రావాలి ఎవరిని ఎవరు కించపరచుకోవద్దు అనగదొక్కుకోవద్దు అని చాటి చెప్పిన సమాజ పరివర్తకుడు బసవేశ్వరుడు.
బసవేశ్వరుడు స్ఫూర్తితో నే ప్రజా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్తు మంత్రి మండలి ముందుకు పోతున్నది. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించి ప్రజలు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని పాలన అందిస్తున్నాం.
వరంగల్ లో బిఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజా ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఒక పెద్దాయన విమర్శలు చేశారు. ప్రజా ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందింది? బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా స్కీములు తీసుకురావడం వైఫల్యం చెందినట్టా? జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బలహీన వర్గాలకు మేలు జరగాలని కులగణన సర్వే చేయడం వైఫల్యమా?
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దేశంలో భూ సంస్కరణలు అమలు చేయాలని చట్టం తీసుకొచ్చిన క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు, రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని నేరుగా ఎదుర్కోలేక.. కొంతమంది దొరలు కృత్రిమంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకువచ్చి పరోక్షంగా అడ్డుకునే కుట్ర చేశారు.
ప్రజలిచ్చిన అధికారాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావిస్తూ అనుక్షణం సమాజ పరివర్తన కోసం ప్రజా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను, యావత్తు మంత్రి మండలి పనిచేస్తున్నది