Suryaa.co.in

Entertainment

‘భీమ్లా నాయక్’ తో డానియల్ శేఖర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ కరోనా మహమ్మారి కనుక విరుచుకుపడకపోయి ఉంటే .. ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో రచ్చ చేస్తూ ఉండేది. కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల తేదిని ఖరారు చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి.

నేడు సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ సినిమా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లుక్ ఆకట్టుకొంటుంది. ఉగ్ర రూపంలో భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ కాకపోయినా కనీసం కొత్త పోస్టర్ నైనా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సంతోషపెట్టారని పవన్ ఫ్యాన్స్ మేకర్స్ కి థాంక్స్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్తా మీనన్ నటిస్తుంది.

LEAVE A RESPONSE