– గతంలో రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి తీసుకుంది
– బీఆర్ ఎస్ కు లాభం చేయడం కోసం చాలా లేట్ గా బలహీనమైన అభ్యర్థి ని బీజేపీ ప్రకటించింది
– గాంధీభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోంది. అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు సుధీర్ఘ కాలం కెప్టెన్ గా వ్యవహరించారు. క్రికెట్ లో దేశానికి ఎంతో సేవ చేశారు. దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరు.అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోంది.
అజారుద్దీన్ పైన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసింది. వీరిద్దరి తెర వెనక బంధాన్ని ఆమె బయటపెట్టింది. గతం లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ సహకారం తో నే బీజేపీ రాష్టం లో 8 సీట్లు గెలుచుకుంది. జూబ్లీ హిల్స్ లో తమకు గెలిచే అవకాశం లేదని బీజేపీ కి తెలుసు.
అందుకే బీఆర్ ఎస్ కు లాభం చేయడం కోసం చాలా లేట్ గా బలహీనమైన అభ్యర్థి ని బీజేపీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ లో మైనార్టీలు ఎవరూ బీజేపీ కి ఓటు వేయరు.
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు లాభం కల్గించడం కోసమే అజారుద్దీన్ ను మంత్రి కాకుండా బీజేపీ అడ్డుకుంటోంది.
అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ పైన బీజేపీ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. నాకున్న సమాచారం మేరకు వారు గొప్ప వ్యక్తి అలా చేయరు అని భావిస్తున్నాను. కుట్రలో భాగంగా ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది.
గతంలో రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి తీసుకుంది. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ
అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్. డిసెంబర్ 30 న ఆయనతో రాష్ట్ర మంత్రి వర్గంలోకి ఏకంగా ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి బీజేపీ తీసుకుంది. ఉప ఎన్నిక కు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం.
కేవలం మైనార్టీ అన్న ద్వేషంతో నే బీజేపీ అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర లను మైనార్టీలు అర్థం చేసుకోవాలి. బై ఎలక్షన్ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే. ప్రమాణ స్వీకారం నియోజకవర్గం బయట జరుగుతుంది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో పోటీ చేయడం లేదు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సమాజంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం కాంగ్రెస్ మూల సిద్ధాంతం. ఈ క్రమంలో అజారుద్దీన్ కు కల్పిస్తున్న అవకాశం పై కుట్రలు చేయడానికి ఖండిస్తున్నాను. రాష్ట్ర మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాల పట్ల నిబద్ధత ఉన్నాయి
తుఫానుకు సంబంధించి ప్రభుత్వం 46 గంటల ముందే అప్రమత్తమయింది 24 గంటలు పనిచేసింది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్, చీఫ్ సెక్రటరీ తో పాటు మొత్తం యంత్రాంగం అప్రమత్తమై కావలసిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ముందస్తు చర్యల మూలంగా భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగాం.
అన్ని ప్రయత్నాలు చేసినా ప్రకృతి విపత్తు వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. నష్టాలు అంచనా వేసి నష్టపోయిన వారికి సహాయం చేస్తాం. తుఫాను నష్టం పై ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆలోచన చేస్తుంది