Suryaa.co.in

Telangana

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై గురువారం తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారులో వెళ్తున్న క్రమంలో మాధవి లతపై దాడికి యత్నించినట్లు తెలిపారు.

LEAVE A RESPONSE