Suryaa.co.in

Andhra Pradesh

చేపల వేటకు వెళ్లిన జాలర్ల ఆచూకీ కనిపెట్టాలని సిఎస్ కు చంద్రబాబు లేఖ

-సముద్రం లో చేపల వేటకు వెళ్లిన మచిలీపట్నానికి చెందిన నలుగురు జాలర్ల ఆచూకీ కనిపెట్టాలని సిఎస్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

తేది : 06.07.2022
గౌరవనీయులైన శ్రీ సమీర్‌ శర్మ గారికి,
ఆంధ్రప్రదేశ చీఫ్‌ సెక్రటరీ,
అమరావతి.

విషయం: వేటకెళ్లిన నలుగురు జాలర్లు గల్లంతుకావడం ` తీవ్ర ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులు ` మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ` అవసరమైతే లాంగ్‌ రేంజ్‌ డ్రోన్‌లతో గాలించాలి.

సముద్రంలో వేటకు వెళ్లిన మచిలీపట్నానికి చెందిన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తమ వారు ఎలా ఉన్నారో అని వారి కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్‌ పేటకు చెందిన చిన మస్తాన్‌, నాంచార్లు, నరసింహారావు, వెంకటేశ్వరరావు సముద్రంలో ఎక్కడ ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలీక కుటుంబసభ్యులు కంటిమీద కునుకు లేకుండా వారి కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. 4 రోజులైనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేదు. రెండు రోజుల క్రితం స్థానిక మత్స్యకారులు రెండు బోట్లు వేసుకుని సముద్రంలో గల్లంతయిన జాలర్ల కోసం గాలించినా ఉపయోగం లేకపోయింది.

విషయం తెలిసిన వెంటనే జాలర్ల కుటుంబసభ్యులను మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నేతల బృందం పరామర్శించగా బాధితులు తమ బాధను తెలియజేశారు. జాలర్ల గల్లంతుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వారి ఆచూకీ కనిపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఈ లేఖ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను.
(నారా చంద్రబాబునాయుడు)

LEAVE A RESPONSE