ఎపి డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డికి చంద్రబాబు లేఖ

-రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్ పై వివరాలతో లేఖ రాసిన చంద్రబాబు
-నేరాలను అదుపు చెయ్యడంలో పోలీసుల వైఫల్యం, నిందితులపై కఠిన చర్యలు డిమాండ్ చేస్తూ లేఖ రాసిన టిడిపి అధినేత
-ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు లేఖకు జతచేసిన చంద్రబాబు
-టిడిపి అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యింది.జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైంది.రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి.పెట్రేగుతున్న వైసిపి గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతుంది.జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పింది.

శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారు.లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో దారుణం జరిగేది కాదు.రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయి.గంజాయి సరఫరాలో వైసిపి నేతల ప్రమేయం కనిపిస్తున్నా….పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవడం లేదు.అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టిడిపి కార్యకర్తపై దాడి చెయ్యడం డిపార్ట్మెంట్ లో పరిస్థితికి అద్దం పడుతుంది.

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగింది.ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎపి పోలీసులు స్పంచకున్నా….కర్నాటక పోలీసులు వైసిపి ఎంపిటిసి ని అరెస్టు చేశారు.తాజాగా ఎపి నుంచి అస్ట్రేలియాకు డగ్స్ వెళ్లిన కేసు లో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయి.నేరాల్లో నిందుతుల పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు…లా అండ్ ఆర్డర్ అమలు పై పోలీసు శాఖ దృష్టిపెట్టాలి.

Leave a Reply