క్రిస్టమస్ ద్వారా మానవసేవే మాధవసేవ అన్న విషయాన్ని చెప్పగలిగాం

– నందమూరి బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేడు హాస్పిటల్ నిర్వహించిన ఈ వేడుకలలో నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్టమస్ కేక్ కట్ చేశారు.

అనంతరం కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ, పండుగ జరుపుకుంటన్న వారందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవే అన్న విషయాన్ని క్రిస్టమస్ ద్వారా
bala2తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు. మన భారత దేశంలో అన్ని మతాల వారు కలసి మెలసి జీవిస్తున్నారని తద్వారా పరమత సహనం ఏమిటో ప్రపంచానికి చూపగలిగామని అన్నారు.

పండుగల సందర్భంగా అందరూ తమ వారితో కలసి సందడిగా పండుగ చేసుకోవాలని భావిస్తుంటారని అయితే మరో మారు ఓమిక్రాన్ పేరుతో నెమ్మదిగా పెరుగుతున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని
bala1అందరూ సురక్షితమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కరోనా కాలంలో వైద్యులు చేసిన సేవలు వైద్యో నారాయణ హరి అన్న పదాన్ని నిరూపించాయని , ఈ కోవలోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కూడా పని చేసిందని అన్నారు.

అంతకు ముందు కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ సిబ్బంది ఏర్పాటు చేసిన క్రిస్టమస్ కేక్ ను కట్ చేశారు. దానితో పాటూ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమాలలో నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ తో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; కె శ్రీవాణి, నర్సింగ్ సూపర్నింటెండెంట్, BIACH&RI లతో పాటూ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థిణి మరియు విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply