Suryaa.co.in

Andhra Pradesh

నిరంతర శ్రామికుడు సీఎం చంద్రబాబు నాయుడు

• రూ . 772 కోట్ల రూపాయలు 2024 -25 సంవత్సరానికి సంబంధించి కార్మిక శాఖకు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
• రూ. 110 కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికుల క్లమ్స్ ఎగ్గొట్టిన ఘనుడు జగన్
• చంద్రన్న బీమా ద్వారా 220 కోట్లను జగన్ నిలిపివేశాడు
• కార్మికుల తిరుగుబాటుతోనే జగన్ ఘోరంగా ఓడిపోయాడు
• విజయవాడలో ఏకంగా 110 పడకలతో వైద్యశాలకు శంకుస్థాపన చేసాం
• గుంటూరు,నెల్లూరు,కర్నూలు ఎలమంచిలి ప్రాంతాలలో వైద్యశాలలను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నాం
– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

విజయవాడ: రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి నిరంతర శ్రామికుడిగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్మికుల సభలో మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు.

అన్ని వర్గాల కార్మికుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా 2024 25 సంవత్సరానికి సంబంధించి కార్మిక శాఖకు ఏకంగా రూ. 772 కోట్లను కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో కార్మికులు ఊచకోతకు నరకయాతన పడ్డారన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల కోసం అమలులో ఉన్న 12 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడని గుర్తు చేశారు.

చంద్రన్న బీమా ద్వారా 250 కోట్లను నిలిపివేసి కార్మికుల జీవితాలతో జగన్ చలగాటమాడారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 20.31 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చెందిన 110 కోట్లను వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిందని ఆరోపించారు. ఇలా అన్నీ చూసుకుంటే కార్మికులను ఘోరంగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీనేన్నారు.

అందువల్లనే కార్మికుల తిరుగుబాటుతోనే జగన్ ఘోరంగా ఓడిపోయాడని.. వైసీపీకి 11 సీట్లు రావడంలో రాష్ట్రంలోనే 86 లక్షల కార్మికుల ప్రభావం కచ్చితంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వైద్య, విద్య రంగాలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో 110 పడకలతో హాస్పటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. గుంటూరు కర్నూలు నెల్లూరు ప్రాంతాలలో కూడా వైద్యశాలల నిర్మాణాలకి శ్రీకారం చుట్టాం. కార్మికులను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ఓటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.

LEAVE A RESPONSE