Suryaa.co.in

Andhra Pradesh

మోడీకి ధన్యవాదాలు

ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ రొంగల

అమ‌రావ‌తి: జాతీయ జన గణన లో కుల గణన చేర్చుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపీశ్రీనివాస్ అన్నారు.

నరేంద్ర మోడీ పాలనలో పారదర్శతకు నిబద్దతకు ఇది నిదర్శనం. ఓబీసీ లో పుట్టి అందరి జీవన విధానాలు గుర్తెరిగిన ప్రధానిగా నరేంద్ర మోదీ అందరి సంక్షేమం కోసం ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకుంటూనే వున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఒక మైలురాయి గా నిలుస్తుంది.

పారదర్శకమైన చర్య ఈ చర్య సామాజిక న్యాయం, సమాచార విధాన రూపకల్పన, భారత సామాజిక వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది
ఇది భారతీయ జనతా పార్టీ నిబద్దత. అందరికి అభివృద్ధి ఫలాలు అందాలి. చిట్టచివరి వ్యక్తి వరకు సంక్షేమం చేరాలి అనే ఆలోచనతో అంత్యోదయ లక్ష్యంతో పని చేస్తున్న భాజపా నిబద్దతకు అనుకూలమైన నిర్ణయం.

LEAVE A RESPONSE