– 12 శాతం కన్నా ఎక్కువ తేమ ఉంటే పత్తి కొంటలేరు
– ఆదిలాబాద్ లో ఎంపీ, ఎమ్మెల్యే కూడా బీజేపీ వారే ఉన్నారు
– వారికి పత్తి రైతును ఆదుకునే బాధ్యత లేదా?
– ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు
– వాళ్లు మాట్లాడితే కేంద్రం ఒప్పుకోదా?
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్: పత్తి రైతుల బాధ చూస్తే కడుపు తరుక్కుపోతోంది. 12 శాతం కన్నా ఎక్కువ తేమ ఉంటే పత్తి కొంటలేరు. ఒక్క బండికి రైతులు రూ. 50 వేలు నష్టపోతున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. 20-25 శాతం తేమ ఉన్న సరే పత్తి కొనుగోలు చేయాలి.
ఇక్కడి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కేంద్రానికి లేఖ రాసి పత్తి రైతులకు మేలు చేయాలి. తేమ ఉన్న, బూజు పట్టిన, మొలకెత్తిన సరే రైతుకు అన్యాయం చేయవద్దు. రాష్ట్రంలోని అన్ని చోట్ల పత్తి రైతు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆవేదనతో ఉన్నాడు. మార్కెట్ కు పత్తి తీసుకొస్తే 12 శాతం తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తామని చెబుతోంది. అసలు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి, ఎంపీ, ఎమ్మెల్యేలకు మొంథా తుపాను వచ్చిన విషయం తెలియదా?
ఆదిలాబాద్ లో ఎంపీ, ఎమ్మెల్యే కూడా బీజేపీ వారే ఉన్నారు. వారికి పత్తి రైతును ఆదుకునే బాధ్యత లేదా? పత్తి తేమ శాతం ఎక్కువ ఉన్న సరే కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో మేము కలెక్టర్ గారితో మాట్లాడితే సీసీఐ తో మాట్లాడాలని చెబుతారు. 12 నుంచి 20 శాతం తేమ ఉన్న సరే కొనుగోలు చేయండి అంటే రాష్ట్రం ప్రభుత్వం తో మాట్లాడమంటారు.
అంటే కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు రైతులంటే లెక్కలేదా? ఐతే బీఆర్ఎస్, లేదంటే జాగృతి లాంటి సంస్థలే రైతుల గురించి మాట్లాడాలా?
వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ వాళ్లే రైతులకు మేలు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు కదా? ఆదిలాబాద్ పత్తి మార్కెట్ లో రైతులను చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి. కడుపు తరుక్కు పోతుంది. ఒక్కో బండికి రైతుకు 50 వేల నష్టం తో ప్రైవేట్ వాళ్లకు పత్తి అమ్ముకుంటున్నారు.
ముఖ్యమంత్రి గారు.. ముందు జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారాన్ని పక్కన పెట్టండి. అక్కడ ఏ పార్టీ గెలిచిన ఒరిగేదీ ఏమీ లేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి పై సీఎం వెంటనే సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నా. 20 నుంచి 25 శాతం తేమ ఉన్నా సరే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తరఫున చెప్పండి.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తేమ, బూజు, మొలకలు వచ్చిన సరే కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే రూల్ కావాలె. ఏ ప్రభుత్వం ఉన్న సరే ఎలాంటి కండిషన్స్ లేకుండా కొనుగోలు చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు బీజేపీ పక్ష నేత కూడా. ఆయన ప్రధానికి, కేంద్రమంత్రి కి మాట్లాడి పత్తి రైతులకు మేలు చేయాలి. బీజేపీ నేతలు కనీసం ఒళ్లు నొప్పించుకుంటలేరు.
ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్లు మాట్లాడితే కేంద్రం ఒప్పుకోదా? రైతుల కోసం బీజేపీ నేతలు ఒళ్లు నొప్పించుకొని పని చేయాలి. ఈ సమస్య కొత్తది కాదు. తుపాను వచ్చిన సంగతి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులకు తెలియదా?
ఒక్కసారి రైతుల వద్దకు వస్తే గానీ మీకు వాళ్ల బాధ అర్థం కాదు. మార్కెట్ యార్డ్ లో హామీలుగా ఉన్న 70 మంది ఆడబిడ్డలను తొలగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఏడీతో మాట్లాడితే ప్రస్తుతానికి దాన్ని ఆపారు. వారి పొట్ట కొట్టవద్దని కలెక్టర్ ని కోరుతున్నా. వారిని పనిలో కొనసాగించాలి.