దళిత జాతి అభ్యున్నతి కోసం సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు అన్నారు. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125అడుగులు విగ్రహా నిర్మాణ పనులను ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు, చెల్లం ఆనంద ప్రకాష్, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు నలుకుర్తి రమేష్, బూదాల శ్రీనివాసరావు , జమ్మలమూడి మార్కు , కాలే వెంకట రమణ, లేళ్ళపూడి లాజరు, కండిలా డేవిడ్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లా రావు మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు. దళిత జాతి నేడు ఇంత అభివృద్ధి సాధిస్తోందంటే అది ఒక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. అలాంటి గొప్ప నాయకులు అంబేద్కర్కు సముచిత గౌరవం ఇస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. దళిత సంక్షేమం కోసం, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.
Devotional
శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలు
ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది. ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే…
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…