Suryaa.co.in

Telangana

లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

– కాంగ్రెస్‌ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు
– 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో, 4600 శాంపిల్స్‌తో సర్వే
– తెలంగాణలో పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్త ట్రాకర్‌ పోల్‌ సర్వే

తెలంగాణలో పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగుతోంది కాంగ్రెస్‌ 8-10, బీఆర్‌ఎస్‌ 3-5, బిజెపి 2-4, పార్లమెంట్‌ సీట్లు గెలుపొందే అవకాశం. కాంగ్రెస్‌పార్టీకు 40 శాతం, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బిజెపి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం.

నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌పార్టీ 1 శాతం ఓట్లు, బిజెపి 9 శాతం ఓట్లు అధికంగా పొందుతుండగా , ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం 6 శాతం ఓట్లు కోల్పోతోంది. కాంగ్రెస్‌ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సర్వేలో వెల్లడి

పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ సంస్థలు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై 11 ఫిబ్రవరి నుండి 17 ఫిబ్రవరి వరకు ట్రాకర్‌ పోల్‌ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ట్రాకర్‌ పోల్‌ సర్వే కోసం ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో, 4600 శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించారు.

 

LEAVE A RESPONSE