Suryaa.co.in

Telangana

జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయండి

-టాప్ 100లో కరీంనగర్ రైల్వే స్టేషన్ కు చోటు కల్పించినందుకు థ్యాంక్స్
-కేంద్ర రైల్వే మంత్రికి బండి సంజయ్ వినతి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈరోజు న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

ఉత్తర తెలంగాణలో జమ్మికుంట రైల్వే స్టేషన్ కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, గత పాలకుల నిర్లక్ష్యంవల్ల తగిన నిధులు లేక అభివ్రుద్ధిని నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జమ్మికుంట రైల్వేస్టేషన్ అభివ్రుద్ధి విషయంపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో 100 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి ఆయా స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన జాబితాలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కు చోటు కల్పించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ప్రత్యేకంగా ప్రత్యేక క్రుతజ్ఝతలు తెలిపారు.

LEAVE A RESPONSE