ధర్మదండం.. ఎత్తిరాజులు!

ఆనందభాష్పాలు రాలుస్తున్న ఈయనెవరో తెలుసా..??
1947లో రాజగోపాలాచారి సూచన మేరకు రాజదండాన్ని తయారుచేసే పనిని చెన్నైలోని ‘ఉమ్మడి బంగారుచెట్టి జూవెలర్స్’ కు అప్పగించారు..

అప్పుడు ఆ సంస్థను నడుపుతున్న ఉమ్మిడి ఎత్తిరాజులు (20), ఉమ్మిడి సుధాకర్ (14) అనే అన్నదమ్ములు తివావదుత్తరై ఆధీనం పీఠాధిపతులను సంప్రదించి చోళరాజుల సాంప్రదాయం ప్రకారం నియమనిష్టలతో రాజదండాన్ని/ధర్మదండాన్ని/సెంగోల్‌ను తయారు చేశారు..

అప్పుడు 1947లో నెహ్రూకు రాజదండాన్ని బహుకరించే సమయంలో ఈ ఫోటోలోని వ్యక్తే తాము తయారు చేసిన ఆ రాజదండాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు..ఇప్పుడు మళ్ళీ అదే రాజదండం తన కళ్ళముందు ప్రధాని మోదీకి బహుకరిస్తున్న సన్నివేశం చూసి ఆయన భావోద్వేగానికి గురై ఏడ్చేశారు.. ఆయనే ఉమ్మడి ఎత్తిరాజులు. ఇప్పుడు ఆయన వయస్సు 95 ఏళ్ళు. ఎంతటి ధన్యమైన జీవితం.

– విజయసారథి

Leave a Reply