– ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం
-రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్
– మంత్రి హరీశ్ రావు
ఇబ్రహీంపట్నం ఘటనలో చనిపోవడం దురదృష్టకరం. బాధాకరం. సంఘటన మా దృష్టికి రాగానే అన్ని చర్యలు తీసుకున్నాము. అపోలో 13 మంది, నిమ్స్ 17 మంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారు.ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా వీరి ఆరోగ్యం సమీక్షిస్తున్నాము.రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారు.
ఆరేడు ఏళ్లలో 12 లక్షల ఆపరేషన్లు చేసాము. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు.ఈ ఘటన సీరియస్ గా తీసుకున్నాము. సూపరింటెండెంట్ మీద చర్యలు తీసుకున్నాము. సర్జరీ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేసాము.విచారణ కమిటీ ఆదేశించాము. రాగానే చర్యలు ఉంటాయి. ఎలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.రాత్రి, పగలు తేడా లేకుండా బాధితుల ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నాము.
ఇప్పుడున్న వారంతా సేఫ్ గా ఉన్నారు. వారికి ఉచిత చికిత్స ఇస్తున్నాం. సహాయకులకు రు. 10 వేల రూపాయలు అందిస్తున్నాం.మేము రాజకీయాలు చేయము. ప్రజల ప్రాణాలు కాపాడాము. రెండు రోజుల తర్వాత వచ్చారు.. మాట్లాడుతున్నారు. మేము ఘటన తెలిసిన నాటి నుండిప్రాణాలు కాపాడేందుకు అవసరమైన కృషి చేస్తున్నం.ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా అంబులెన్స్ పంపి ఆస్పత్రికి తీసుకొచ్చాంమా ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడే ఉంటున్నారు… వారిని గంట గంటకు మానిటర్ చేస్తున్నాం.
బాధితులకు 5లక్షల ఎక్స్ గ్రెషియా అందజేశాయి డబుల్ బెడ్ రూం అందజేస్తాం.ప్రతిపక్షాలు ఇవ్వాళ హాస్పిటల్ కి వచ్చి హడావుడి చేస్తున్నారు. మేము ఘటన జరిగిన మరుక్షణం నుంచి మినుట్ టు మినిట్ రాత్రింబవళ్ళు వాళ్ళను కాపాడుకుంటున్నాము.ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందిప్రభుత్వం దృష్టి కి వచ్చిన వెంటనే మిగిలిన పేషంట్స్ నీ కూడా అపోలో, నిమ్స్ లో చికిత్స అందిస్తున్నాంవారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నాం. అందరూ సేఫ్ గా ఉన్నారు… అపోలో 13మంది నిమ్స్ లో 17మంది ఆరోగ్యంగా ఉన్నారు.
ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టింది…రెండు మూడు రోజుల్లో వీరిని డిశ్చార్జ్ కూడా చేస్తాం రాష్ట్రంలో 6, 7 సంవత్సరాల్లో 12 లక్షల కూని ఆపరేషన్ లు చేసాము. ఆపరేషన్ చేసిన వైద్యుని లైసెన్స్ రద్దు చేసాము. సూపరిండెంట్ ని సస్పెండ్ చేశారు.భవిష్యత్తులో ఇలాంటి వి పునరావృత్తం అవకుండా జాగ్రత్త పడుతము. ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకున్నాం.