Suryaa.co.in

Telangana

పోరాట స్ఫూర్తిచాటిన వీర వనిత చాకలి ఐలమ్మ:తలసాని

పోరాట స్ఫూర్తిని చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా సిక్ విలేజీ లోని మడ్ పోర్డ్ ధోభీ ఘాట్ వద్ద ఆమె విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండ్ లోని ధోభీఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, అనేక భూ పోరాటాలు, పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఐలమ్మ జయంతి, వర్ధంతి ని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి KCR ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం పోరాట యోధులను ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. ఐలమ్మ పోరాటాలకు గుర్తుగా, భవిష్యత్ తరాలకు ఆమె చరిత్రను తెలియజేసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. హైదరాబాద్ లో 3 ఎకరాల విస్తీర్ణంలో 5 కోట్ల రూపాయల ఖర్చుతో స్మారక భవనం నిర్మిస్తుందని, 5 వ తరగతిలో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ఆమెకు సముచిత గుర్తింపు, గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.

LEAVE A RESPONSE