Suryaa.co.in

Andhra Pradesh

భద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదం

-నిర్లక్ష్యంతో మత్య్సకారుల ప్రాణాలకు ముప్పుతేవద్దు
-తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి :- విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణం. వరుస ప్రమాదాలు జరుగున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇది వరకే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి..వాటిని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. సీఎం జగన్ రిషికొండ ప్యాలెస్ నిర్మాణంపైనున్న శ్రద్ధ ప్రజల భద్రతపై పెట్టాలి. అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది..బోట్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే కొత్త బోట్లు అందజేయాలి. మరోమారు అగ్నిప్రమాదాలకు తావులేకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE