నిద్దురపోతున్న నిఘా వ్యవస్థ.. చెలరేగుతున్న ఉగ్రవాద సంస్థలు

-ఓట్ల వేటలో పడి ప్రజా భద్రతను వదిలేసిన ప్రభుత్వం
-“స్టీరింగ్ “మన చేతిలోనే ఉందనే భావనాతో రెచ్చిపోతున్న దేశద్రోహులు
-ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న హవాలా డబ్బు లావాదేవీల్లో దాగి ఉన్న ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టి, వారిని చట్టపరంగా శిక్షించాలి
-ఆంధ్రప్రదేశ్ లోని కడప కేంద్రంగా దశాబ్దాలుగా సాగుతున్న పీఎఫ్ఐ శిక్షణ శిబిరాలపై నిగ్గు తేల్చాలి
-తెలంగాణ రాష్ట్రాన్ని జల్లెడ పడితే మరిన్ని ఉగ్ర సంస్థలు వెలుగులోకి..
-ఇప్పటికీ జాడ లేని పిఎఫ్ఐ శిక్షణ పొందిన 500 మంది ఉగ్రవాదులు
-ఇప్పటికైనా హిందూ వ్యతిరేక చర్యలను కేసిఆర్ ప్రభుత్వం వదిలేయాలి
-విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరి నాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

తెలంగాణ ప్రభుత్వం భద్రతను విస్మరిస్తోంది. ఉగ్రవాదులకు.. అరచకత్వానికి బాటలు వేస్తోంది. దీంతో గతంలో భాగ్యనగర్ మాత్రమే ఉగ్రవాదులకు అడ్డంగా ఉండేది.. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోయింది. ఉగ్రవాదులకే పోలీసులు ఆశ్రయము కల్పిస్తుండటం మరింత ఆశ్చర్యానికి గురి చేసే విషయం. హిందూ నాయకులను హతమార్చి, హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించేందుకు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్ యంత్రాంగం విఫలమవుతోంది. తమకు అనుమానాలు రాకుండా పోలీసుల ఇళ్లలోనే స్థావరాలు ఏర్పరచుకొని విచ్ఛిన్నకర కార్యకలాపాలు కొనసాగించడం మరీ విచిత్రం.

హిందూ సమాజంలోకి చొచ్చుకెళ్ళి అల్లర్లు సృష్టించడం.. అమ్మాయిలను ఎత్తుకెళ్లడం.. బలవంతంగా సాహిత్యం అందించడం.. మతమార్పిడులు చేయడం.. ఇలా రకరకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నటించి విద్విషాలు రగిలించే పనిలో ఉగ్ర మూఖలు నిమగ్నమై ఉన్నాయి. ఇదే విషయాన్ని మూడు నెలల క్రితమే విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. కానీ అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భద్రతాపరమైన విషయాల గురించి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కరాటే శిక్షణ పేరుతో నిజామాబాద్ లో అప్పట్లో దాదాపు 500 మంది శిక్షణ పొంది పరారయ్యారని, వారి వల్ల ముప్పు ఉందని విశ్వ హిందూ పరిషత్ అప్పుడే హెచ్చరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.

ఈరోజు పిఎఫ్ఐ అనే నిషేధిత సంస్థ దాదాపు 15 విభాగాలుగా విడిపోయి, ఎవరికి అనుమానం రాకుండా హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోంది. సేవా కార్యక్రమాల ముసుగులో.. కరాటే శిక్షణ పేరుతో ముస్లిం యువకులకు శిక్షణ ఇవ్వడం చూస్తుంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. అల్లర్లు సృష్టించడం.. గురిపెట్టి రాళ్లు విసిరితే ఒక్క పెట్టుకే తల పగిలి ప్రాణాలు వదలడం.. కత్తులతో కడుపులో పొడవడం.. ప్రాణాలు తీయడం వంటి అనేక హత్యల విషయంపై శిక్షణ ఇస్తున్నటువంటి యువకులపై తెలంగాణ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేనికి సంకేతం అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది.?

గ్రూపులు గ్రూపులుగా వేరుపడి కోడ్ భాష ఆధారంగా దాడులకు ఉసిగొల్పడం.. సేవ పేరుతో విరాళాలు సేకరించడం.. హిందువులను భయభ్రాంతులను గురి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్న కూడా తెలంగాణ పోలీసులు పట్టించుకోకపోవడం తోనే ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో పాటు సోషల్ డెమొక్రటిక్ పార్టీ నాయకులు తమ విద్వేషపూరిత కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు ప్రశాంతంగా నిద్రపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్క రోజులోనే దాదాపు 40 కి పైగా ప్రాంతాలలో సోదాలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకుంటుంటే..రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. పైగా రాజకీయ కోణంతో పోలుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. వారిని సోదాలు నిర్వహించకుండా అడ్డుకోవడం.. పట్టుకున్న ఉగ్రవాద మూలాలున్న వ్యక్తులను వదిలేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారి చేతిలో ఏ విధంగా బంధీ అయిందో తెలిసిపోతోంది.

ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న హవాలా డబ్బు లావాదేవీల్లో దాగి ఉన్న ఇద్దరు తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టీ, వారిని చట్టపరంగా శిక్షించాలి. లెక్కకు మించి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చట్ట పరంగా వివరాలు రాబట్టాలి. అధికార అండదండలతోనే ఈ దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని అనడం లో ఎలాంటి సందేహం లేదని VHP భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప కేంద్రంగా దశాబ్దాలుగా సాగుతున్న పీఎఫ్ఐ శిక్షణ శిబిరాలపై నిగ్గు తేల్చాలి. అక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులను పట్టుకుని ఎన్ కౌంటర్ చేయాలి.

ఏది ఏమైనా ఉగ్రవాద మూలాలను పెకిలించి రాష్ట్ర ప్రజలకు, హిందూ సంస్థలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం విస్మరించరాదని విశ్వహిందూ పరిషత్ గుర్తు చేస్తోంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పనిగట్టుకుని భాగ్యనగరంలో మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల మునావర్ ఫరుకి అనే ఓ హిందూ వ్యతిరేకిని తీసుకువచ్చి ప్రధానమంత్రి స్థాయిలో భద్రత కల్పించి, హిందువులను.. హిందూ దేవి దేవతలను నోటికి వచ్చినట్టు తిట్టిపించిన ఘనత రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ కి దక్కుతుందని విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది.

రాజకీయాలు చేసుకోవడంలో తమకు అభ్యంతరం లేదని.. కానీ రాజకీయం ముసుగులో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తూ.. హిందువులపై దాడులను ప్రోత్సహించే వ్యక్తులకు మద్దతు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్య అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం NIA చేసిన సోదాలతో సరిపెట్టకుండా, రాష్ట్రాన్ని మొత్తం జల్లెడ పట్టి ఉగ్ర మూలాలను పెకిలించాలని.. బాధ్యులను.. వారికి సహకరిస్తున్న మద్దతుదారులను శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు తావు లేకుండా పాలన కొనసాగించాలని సీఎం కేసిఆర్ కి సూచిస్తోంది.

మునావర్ ఫరుకి భాగ్యనగర్ వచ్చిన సందర్భంలో రగిలించిన విద్వేషాల కారణంగా విశ్వహిందూ పరిషత్ నాయకులకు బెదిరింపు కాల్స్ వచ్చినా పట్టించుకోలేదని.. పైగా విశ్వహిందూ పరిషత్ నాయకుల పైనే తెలంగాణ ప్రభుత్వం సుమోటాగా కేసులు నమోదు చేయడం హిందూ వ్యతిరేక చర్యలో భాగం కాదా అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఎంఐఎం మెప్పు కోసమే ఇదంతా చేస్తుందని, ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరి నాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply