Suryaa.co.in

Telangana

గ్రీన్‌ తెలంగాణ 2050 మాస్టర్‌ ప్లాన్‌ తయారు

-తెలంగాణ చరిత్ర పుటల్లో..ఆ ముగ్గురు మహిళలు
-వారి త్యాగం, సాహసం, సహకారంతోనే రాష్ట్రం
-సోనియా, మీరాకుమార్‌, సుష్మాస్వరాజ్‌లకు కృతజ్ఞతలు
-బానిసత్వాన్ని తెలంగాణ ప్రజలు సహించరు
-బానిస సంకెళ్లు బద్దలుకొట్టి ప్రజాపాలన తెచ్చాం
-లోపాలు ఉంటే సమీక్షించుకుంటాం..సరిదిద్దుకుంటాం
-బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా?
-తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం
-చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది
-త్వరలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన
-ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతున్నాం
-మూడు జోన్లుగా తెలంగాణ విభజనం
-‘‘జయ జయహే తెలంగాణ’’ను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నాం
-ప్రపంచానికి దిక్చూచిగా తెలంగాణ..
-నెంబర్‌ వన్‌ బ్రాండ్‌గా హైదరాబాద్‌
-తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ముగ్గురు మహిళా నేతలు చేసిన త్యాగాలు, అందించిన సహకా రంతోనే తెలంగాణ వచ్చిందని, వారిని తెలంగాణ ప్రజలు మరిచిపోలేరని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికిం ద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సీఎం సందేశమిచ్చారు. ఆనాడు యూపీఏ చైర్‌ప ర్సన్‌గా ఉక్కు సంకల్పంతో మొట్ట మొదటి త్యాగం..సాహసం చేసి రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు. అప్పటి స్పీకర్‌బాబు జగ్జీవన్‌రామ్‌ కూతురు ఒక మహిళ గా, కన్న తల్లిగా పిలల్లను కోల్పోతే ఆవేదన ఎట్లుంటదో తెలిసిన అమ్మగా సంపూ ర్ణమైన సహకారాన్ని అందించారు. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడం లో అత్యంత కీలకమైన బాధ్యతను పోషించారు. అనాటి భారతీయ జనతాపార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలిగా సంపూర్ణ సహకా రం అందించారు. తెలంగాణ బిల్లు ఆమోదించటంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తన సంపూర్ణ సహకారాన్ని అందించారు. తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలా దిమంది అడబిడ్డల సాక్షిగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, నాటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు
ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ…అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షే మం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. డిసెంబర్‌ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్ధలు కొట్టాం. మున్సిపల్‌ కౌన్సిలర్‌ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకు లం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం.

మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం
తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వా లన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత. జూన్‌ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. భౌతిక విధ్వంసం మాత్రమే కాదు. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి – సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. ఇది గతం…

బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా?
ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్బావ దినోత్సవం ఇది. ఏ హోదాలో సోనియాను ఆహ్వానించారని అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యా నికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్‌ అవసరమా? ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం? తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీ యాలకు అతీతం.

ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు
దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో… అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం..ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్‌ నిర్మాణానికి కీలకాంశాలు. ఆ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు. సహజ కవి అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ’’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం.

చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది
జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం.

త్వరలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన
తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే… మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే… తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి… కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జర గాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి త్వరలో రూపుదిద్దు కుంటుంది. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.

ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతున్నాం
మేము వచ్చేనాటికి రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణ ఉంది. శాసనసభలో శ్వేత పత్రం పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి  ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కఠినమైన ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూనే… సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తేదీనే వేతనాలు ఇస్తున్నాం.

మూడు జోన్లుగా తెలంగాణ
మొత్తం తెలంగాణకు ‘‘గ్రీన్‌ తెలంగాణ – 2050 మాస్టర్‌ ప్లాన్‌’’ తయారు చేస్తు న్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ప్రాంతం సబ్‌ అర్బన్‌ తెలంగాణ. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి. ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం.

మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌ గా తీర్చిదిద్దబోతున్నాం. ఈ పథకానికి ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటా యించాం. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడు తుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించాం. రీజినల్‌ రింగ్‌ రోడ్డు త్వరితగతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం
తెలంగాణలో డ్రగ్స్‌ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్‌, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. టీ న్యాబ్‌కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు.
అందుకే ఉక్కు పాదంతో అణచివేయాలని సంకల్పించాం. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు… వ్యక్తిగతంగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను.

పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన
ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్‌ 28 నుండి 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాం. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం ఒక కోటి 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. డూప్లికేట్‌ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మది వేల దరఖాస్తులు మిగిలాయి. ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం.

ఎడ్యుకేషన్‌ హబ్‌గా తెలంగాణ
తెలంగాణను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయబో తున్నాం. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై అధికా రుల బృందం ఇప్పటికే ఢల్లీి, ఒడిస్సా, గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపా యాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయ్‌ లెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్‌ సదుపాయం కల్పిస్తున్నాం. దీని కోసం 1135 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాం.

పెట్టుబడుల ఆకర్షణలో రికార్డ్‌
దావోస్‌ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడు లకు సంబం ధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చే కార్యచరణ మొదలుపెట్టాం. తద్వారా మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా సంకల్పం. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తాం. విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టే ఆర్డర్‌ మహిళా సంఘాలకే అప్పగించాం.

తెలంగాణ ముందు పలు సవాళ్లు
కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. పదేళ్లయి నా నీటి పంపకాలు జరగ లేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుని సాగునీటి ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వ ఆలోచన. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్‌తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనం త త్వరగా పరిష్కరించుకుంటాం.

ప్రపంచానికి దిక్చూచిగా తెలంగాణ
తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. ప్రపంచానికి మన సత్తా చాటే శక్తి గా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, సత్తువ ఉంది… తెలివి ఉంది, తెగింపు ఉంది త్యాగల చరిత్ర ఉంది. ప్రపంచ నెంబర్‌వన్‌ బ్రాండ్‌గా హైదరాబాద్‌ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్‌గా మార్చాలన్న తపన ఉంది.

LEAVE A RESPONSE