Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు జీవీఎల్ ఏజెంట్

-జీవీఎల్ శకుని పాత్ర పోషిస్తున్నారు
-మాజీ మంత్రి జవహర్

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సీఎం జగన్‌కు ఏజెంట్‌లా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత జవహర్‌ అనుమానం వ్యక్తం చేశారు. జీవీఎల్‌ వ్యాఖ్యలు వైసీపీకి మేలుచేసేలా ఉన్నాయన్నారు. టీడీపీ-బీజేపీ పొత్తుపై జగన్‌ కంటే జీవీఎల్‌ ఎక్కువ భయపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. జీవీఎల్‌ శకుని పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇంకా జవహర్‌ ఏమన్నారంటే.. బిజేపి గురించి మాట్లాడకుండా చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారు. పొత్తు పొసగుతుందని జగన్ కన్నా జీవీఎల్ ఎక్కువ ఆందోళనలో ఉన్నారు. దక్షిణాది లో వారి బలం తెలిసి కూడా జీవీఎల్ ఇలా మాట్లాడటం సరికాదు. జగన్ కు ఏజంట్ గా జీవీఎల్ వున్నారు. రాష్ట్రంలో వున్న పరిసితి జీవీఎల్ కు ఆనందంగా వున్నట్టు వుంది. జగన్ సాగనంపటం మీద దృష్టి లేదు. తెలుగు దేశం పై జీవీఎల్ ద్వేషం వీడాలి.

విభజిత ఆంద్రప్రదేశ్ కు రావలసిన ప్రయోజనాల గురించి మాట్లాడాలి. జగన్ దోపిడిపై నోరు మెదపాలి. విశాఖ దోపిడీ జివియల్ కు కనపడక పోవటం వింతేమి కాదు.జీవీఎల్ చంద్రబాబు ను విమర్శించటం మానుకోవాలి. రాజకీయం మారాలంటే జీవీఎల్ మీ విధానం మారాలి. ఐక్య పోరాటాలకు విఘాతం కలిగించే విధంగా జీవీఎల్ ప్రకటనలు ఉన్నాయి. జీవీఎల్ ఉద్దేశం వ్యక్తిగతమనుకుంటున్నాము.

LEAVE A RESPONSE