Suryaa.co.in

Telangana

సన్న బియ్యంతో పేదల్లో సంతోషం

– మంత్రి పొన్నం ప్రభాకర్
-కలెక్టరేట్ లో సన్న బియ్యం పంపిణీ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం
– సమావేశంలో పాల్గొన్న సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ ,జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ లక్ష్మీ ,సివిల్ సప్లయి అధికారులు

హైదరాబాద్: ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పథకం ఉగాది రోజు ప్రారంభం కాగా, హైదరాబాద లో ఎన్నికల కోడ్ వలన నెల రోజులు ఆలస్యంగా ప్రారంభం అయింది. ఇప్పటికే హైదరాబాద్ లో 20 శాతం సన్న బియ్యం పంపిణీ పూర్తయింది.

సన్న బియ్యం పంపిణీ లో ఎక్కడైనా సమస్యలు వస్తే అధికారుల దృష్టికి తీసుకురండి. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో బియ్యం లబ్ధిదారుడు తీసుకోక పక్కదారి పట్టేవి. ఈ బియ్యం బయట కొనుక్కుంటే 60 రూపాయలు కేజి వస్తాయి. గ్రామాల్లో మూడు పూటల అన్నం తింటారు. హైదరాబాద్ ప్రాంతాల్లో బిన్నంగా ఉంటుంది.

గతంలో దొడ్డు బియ్యం రీసైక్లింగ్ జరుగుతుందనే పిర్యాదులు వచ్చేవి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్,మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం ,ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంచుకున్నాం. సన్న వడ్ల కు 500 బోనస్ ఇస్తున్నాం. అందువల్ల పక్క రాష్ట్రాల నుండి కూడా లారీలు ఇక్కడికి వస్తున్నాయని కంప్లైంట్ వచ్చాయి. సన్న బియ్యం పంపిణీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపు 69 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్టీసీ లో 3 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం..ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు విస్తృత ప్రచారం కల్పించాలి
నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. సన్న బియ్యం పేదలకు అత్యంత ఉపయోగపడే వినియోగించుకునే పథకం. సన్న బియ్యం పంపిణీ వల్ల ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం పంపిణీ లో ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ జరుగుతుంది.

LEAVE A RESPONSE