Suryaa.co.in

Telangana

నెరేగా పనిదినాలు పెంచాలి

– రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలి
రాష్ట్రానికి మంజూరైనా నెరేగా పనిదినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయం.
– మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: 2024-25లో 12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఈ సంవత్సరం కేవలం 6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా, తెలంగాణకు సాధించింది ఏం లేదు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. తెలంగాణకు జరిగే నష్టం పై నోరు మెదపకపోవడం దుర్మార్గం.

మరోవైపు ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. వారి జీవితాలతో ఆడుకుంటున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరేగా పనిదినాలు పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE