రెండు రోజుల పాటు భారీ వర్షాలు

వర్షాల పేరు చెబితేనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..నిన్న మొన్నటిదాకా భారీ వర్షాల తో జనం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు..ఇకపోతే వర్షాలు తగ్గిన కూడా కొన్ని ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొన్ని ప్రాంతాలు ఇంకా నీటిలోనె ఉంటున్నాయి..మరో వైపు అన్ని సరఫరాలు నిలిచి పోయాయి. అంధకారంలో మునిగి పోయారు జనం. ఆ వర్షాలకు ఇంకా పూర్తిగా కోలుకొలేదు… ఇప్పుడు మరోసారి వరుణుడు గర్జించనున్నాడు. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందన్న అధికారులు.. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓమోస్తరు వానలు పడతాయి. గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షం పడనుంది. కాగా.. బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో అత్యధికంగా 33.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలోని 27 జిల్లాల్లో 60 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి బయటపడుతున్న ప్రజలను వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు భయాందోళన కలిగిస్తున్నాయి.

ఇక ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారి ప్రమాదకరంగా మారాయి. ఇలా నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ కు భారీ వరదనీరు చేరి ప్రమాద ఘంటికలు మోగించింది. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండానే వరద ప్రవాహం తగ్గడంతో స్థానిక ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.. వరద కొనసాగుతోంది.

తెలంగాణలోని మంచిర్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని సాగరసంగమం వరకు పరీవాహక ప్రాంతాలను నిండా ముంచింది. మంచిర్యాల, మంథని, చర్ల, భద్రాచలం, ధవళేశ్వరం, లంక గ్రామాలను వరదతో ముంచెత్తింది. భద్రాచలం వద్ద ఒకానొక దశలో నీటిమట్టం 70 అడుగులు దాటింది.ఇక మరోసారి కురిసే వర్షాలకు పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

Leave a Reply