Suryaa.co.in

Telangana

రేవంత్‌రెడ్డిపై కేసును కొట్టేసిన హైకోర్టు

– కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది.

దీంతో రేవంత్‌రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈక్రమంలో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని చెప్పారు.

కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత

మరోవైపు సైఫాబాద్‌ పీఎస్‌లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్‌రెడ్డిని కించపర్చే విధంగా మాట్లాడారని.. ఎంపీ అనిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసును కొట్టేయాలని కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

LEAVE A RESPONSE