Suryaa.co.in

Telangana

బండి సంజయ్ పై నమోదైన ఎన్నికల కోడ్ కేసుపై హైకోర్టు స్టే

ఎన్నికల కోడ్ ఉల్లఘించారనే ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై నమోదైన కేసుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. 2019 జనరల్ ఎలక్షన్ సమయంలో జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, మాజీ మంత్రి బాబు మోహన్ సహా మరో 10 మంది బిజెపి నాయకులపై మల్యాల పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
ఈ కేసును సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది, బీజేపీ లీగల్ సెల్ నేత కరుణ సాగర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ బండి సంజయ్, బాబు మోహన్, ఇతర బిజెపి నాయకులు పై నమోదైన కేసులో స్టే విధిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A RESPONSE