క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
స్విమ్మింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో మొదటి సారిగా స్విమ్మింగ్ ర్యాంకింగ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్విమ్మింగ్ పోటీల నిర్వాహణ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
డిసెంబరు 20 తేది 23 వరకు గచ్చిబౌలి స్డేడియం స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించే ఈత పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఈతగాళ్లు పాల్గొనున్నారని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ గారికి వివరించారు. దేశంలో మెట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న పోటీలకు హైదరాబాద్ వేదికగా కావడంతో పాటు క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్యక్షుడు రామకృష్ణ , గచ్చిబౌలి స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్యక్షుడు , ర్యాంకింగ్ పోటీల నిర్వహణ కమిటి చైర్మెన్ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రదాన కార్యధర్శి కొండ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.