Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

– జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా
– బాబు కుటుంబంతో వ్యక్తిగత విబేధాల్లేవు
– పవన్ నాకు చిరకాల స్నేహితుడు
– వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి : వైసీపీ రాజ్యసభ ఎంపి, వైసీపీలో కొద్దిరోజుల క్రితం వరకూ నెంబర్‌టూగా వెలిగిన వేణుంబాక విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైనం సంచలనం సృష్టించింది. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు.

విజయసాయిరెడ్డి లేఖ పూర్తి పాఠం ఇదీ..

రాజ్యసభ సభ్యత్వానికి 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.

రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది.

నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

LEAVE A RESPONSE