Suryaa.co.in

Telangana

పాదయాత్ర చేస్తున్నందున ఢిల్లీకి రాలేకపోతున్నాను

– అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇచ్చాను
– సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీ లో బుధవారం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశానికి తాను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రాలేకపోతున్నానని, అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కొరకు మధిర నియోజకవర్గంలో గత నెల 27 నుంచి పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నాని, పాదయాత్ర పూర్తి అయిన తర్వాత వచ్చి కలుస్తాను అని అధినేతకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్నందునే ఈ రోజు డిల్లీలో జరిగే ముఖ్య నాయకుల సమావేశానికి వెళ్లలేదన్నారు. పాదయాత్ర ముగించుకున్న తర్వాత ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని వెల్లడించారు.

LEAVE A RESPONSE