Suryaa.co.in

Andhra Pradesh

ప్రకాశం బ్యారేజికి ఐసిఐడి ప్రతిష్టాత్మక వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డు

అమరావతి,6 అక్టోబరు:విజయవాడ వద్ద కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజికి ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ICID)కు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ (WHIS)అవార్డుకు ఎంపికైందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ,సెంట్రల్ వాటర్ కమీషన్ ఇన్సిఐడి డైరెక్టర్ అవంతి వర్మ ఈమేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి వ్రాసిన ఒక లేఖలో తెలియజేశారు.

వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసిఐడి ఈఅవార్డులను ఏర్పాటు చేసిందని తెలిపారు. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ -2023 అవార్డులకు ఐసిఐడి,ఐఎన్సిడిల తరపున నామినేషన్లు కోరగా వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈఅవార్డులకు ప్యానల్ జడ్జెస్ సిఫార్సు చేసి ఎంపిక చేయగా వాటిలో భారతదేశం నుండి 4 నిర్మాణాలను ఈవరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్-2023 అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు.

భారతదేశం నుండి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజితో పాటు ఒడిస్సా లోని బలిద్హిహా(Balidiha)ప్రాజెక్టు మరియు జయమంగళ ఆనకట్టలు,తమిళనాడులోని శ్రీవాయికుంటం(Srivaikuntam) ఆనకట్ట ఈఅవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు.ఈవిధంగా ఎంపికైన నిర్మాణాలను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లకు సంబంధించిన ఐసిఐడి రిజిష్టర్ లో నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2నుండి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసిఐడి కాంగ్రెస్ మరియు 74వ ఐఇసి సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ప్రదానం చేయనున్నట్టు డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు.

ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానపత్రికను త్వరలో ఆయా రాష్ట్రాలకు పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.కావున ఈఅవార్డులకు ఎంపికైన రాష్ట్రాలు 25వ ఐసిఐడి కాంగ్రెస్ మరియు 74వ ఐఇసి సమావేశానికి హాజరగుటకు రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ణప్తి చేశారు.

LEAVE A RESPONSE