Suryaa.co.in

Political News

అన్నీ తెలుసనుకుంటే.. మన ఖర్మం!

యుద్ధం ముగిసింది ..అర్జునుడు హుందాగా కూర్చోగా
రథం నగరానికి వచ్చింది…
కృష్ణుడు అర్జునుడిని ఓరకంట చూస్తూ ” దిగు పార్ధా” అన్నాడు.
పార్థుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు..
ఆనవాయితి ప్రకారం ముందుగా సారథి దిగి
రథం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు……..
దానికి విరుద్ధంగా ముందు సారథి దిగకుండా తనను దిగమనడంతో అర్జునుడి అహం అడ్డు అయింది…
ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక… అర్జునుడు రథం దిగుతాడు.
అర్జునుడు దిగి కొంతదూరం పోయాక అప్పుడు దిగాడు కృష్ణుడు ..
మరునిముషంలోనే రథం భగ్గున మండి బూడిద అయింది…
అదిరిపడ్డాడు అర్జునుడు…
యుద్ధం లో ఎన్నో దివ్యాస్త్రాలు ప్రయోగించబడినవి ,వాటిని తన శక్తి ద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు. ఆయన దిగగానే శక్తి విడుదలై రథం మండిపోయింది… అదే ముందు కృష్ణుడు రథం దిగి ఉంటే…..?
అలానే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి.
తప్పదు…
చెప్పడం ధర్మం…నాకు అన్నీ తెలుసనుకుంటే మన ఖర్మం….

” ఓం నమో భగవతే వాసుదేవాయ”

– వరప్రసాద్

LEAVE A RESPONSE