బ్రాహ్మణ కులంతో దళితుల కాళ్లు పట్టించానని చెప్పించటమేనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం?
వైసిపి సభల్లో అగ్రకులాలను తిట్టించడమే మీ ప్రభుత్వ సామాజిక సాధికారత ?
బలహీనులపై దాడి చేయడమే మీ అంబేద్కరిజమా?
పెత్తందారులకు బానిసలుగా మారమని అంబేద్కర్ మీకు చెప్పాడా?
మీ బానిసత్వాన్ని చూసి అంబేద్కర్ ఆత్మ కూడా ఘోషిస్తుంది
మిగిలిన కులాలన్నీ అవమానించమని అంబేద్కర్ మీకు చెప్పాడా ?
మాలమహానాడు విచ్ఛిన్నానికి జూపూడే కారణం కాదా?
దళితుల నోట్లో ఉచ్చ పోయించటమేనా ఈ ప్రభుత్వ గొప్పతనం..?
జగన్ ప్రభుత్వంలో దళితుడి నోట్లో ఉచ్చ పోసినప్పుడు జూపూడి నీ నోరు ఎందుకు పెగల్లేదు…?
సొంత చెల్లి కుటుంబానికి న్యాయం చేయలేని జూపూడి ప్రభాకర్ దేనికి నీకు ఈ పదవులు?
జూపూడి ప్రభాకర్ నీ అధికారిక పదవులు అనుభవించడానికి ఈ రాష్ట్రంలో ఏ కుల పెత్తందార్ల కాళ్లు పట్టుకున్నావో దమ్ముంటే చెప్పు..?
అమరావతి: దళిత వైసిపి నాయకుడు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ కావలిలో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికారత సదస్సులో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా బ్రాహ్మణులతో దళితుల కాళ్లు పట్టించాడని శభాష్ జగనన్న అని… ఈ ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని జూపూడి ప్రభాకర్ తన ప్రసంగంలో బ్రాహ్మణ కులాన్ని అవమానిస్తూ తీవ్ర పదజాలంతో ప్రసంగించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ సమాజం తరఫున బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అన్నారు.
జగన్ ప్రభుత్వంలో అగ్రవర్ణాల్ని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుందా అని శ్రీధర్ ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రినే “కమ్మ” కులాన్ని టార్గెట్ చేసి పరుష పదజాలంతో వ్యాఖ్యానించటం, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాదుతో “వైశ్య” కులాన్ని మహాత్మా గాంధీని తీవ్రంగా అవమానించడం, వైసీపీలో “కాపు” నేతలతో కాపు కులాన్ని అవమానించడం, ఇప్పుడు “బ్రాహ్మణ” కులాన్ని టార్గెట్ చేసి వైసిపి నాయకులతో వైసిపి సభల్లో అగ్రకులాలను తిట్టించడమే మీ ప్రభుత్వ సామాజిక సాధికారత అని శ్రీధర్ ప్రశ్నించారు.
జూపూడి ప్రభాకర్ ప్రభుత్వ హోదాలో ఉండి కొండపిలో తన సొంత చెల్లి కుటుంబానికి చెప్పుల్లేకుండా తిరుగుతున్నారని, తనే ఆ మీటింగ్ లో చెప్పుకొని జగనన్న వాళ్లకు చెప్పులు, బూట్లు కొనిచ్చాడు అని చెప్పడం, వాళ్ల కాళ్ళ కొలతలు ఒక బాపనోడితో(బ్రాహ్మణ తో) జగనన్న కొలిపించినట్టు, ఈ పని ద్వారా జగనన్న సామాజిక సాధికారత సాధించినట్లుగా గొప్పగా ఆ సభలో మాట్లాడటం పై బ్రాహ్మణ సమాజం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. తన సొంత చెల్లి కుటుంబానికి న్యాయం చేయలేని ఈ వ్యక్తి , ఈ రాష్ట్రంలో దళిత సమాజానికి ఏ న్యాయం చేస్తాడని శ్రీధర్ ప్రశ్నించాడు.
గతంలో జూపూడి ప్రభాకర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డిని ఏసుప్రభుతో పోలుస్తూ దళిత సమాజంలో తప్పుడు భజన చేయడం జరిగిందని, ఆ తర్వాత భారత జాతీయ మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల పక్కనే, ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి మరొక తప్పు చేశాడని, దళిత వర్గీకరణ అంశంలో మాల సామాజిక వర్గం పోరాటం కోసం స్వర్గీయ పీవీ రావు మాల మహానాడు స్థాపించాడని, ఆయన ఆకస్మిక మరణంతో జూపూడి ప్రభాకర్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుగా వున్న సమయంలో, ఇతని వ్యవహార శైలి నచ్చక మాల మహానాడు అనే కుల సంఘం ముక్కలు, చెక్కలుగా అయిపోయిందని దానికి జూపూడి ప్రభాకర్ కారణం అని గుర్తు చేశారు.
ఈ మూడు తప్పులను గమనించిన దళిత సమాజం జూపూడి ప్రభాకర్ను తమ సమాజం నుంచి దూరం పెట్టి వెలివేసిందని, కొండపి నియోజకవర్గం లో శాసనసభ్యుడిగా పోటీ చేస్తే కనీసం దళితులు కూడా ఓట్లు వేయకుండా ఓడించారని గుర్తు చేశారు. ఇతను ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పెత్తందారుల కాళ్లు పట్టుకొని, ఒళ్ళు పిసికి పదవులు సంపాదిస్తాడని, మీ దళిత సమాజమే నీ గురించి కోడై కోస్తుందని, పెత్తందారులకు బానిసలుగా మారమని, మిగిలిన కులాలన్నీ అవమానించమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మీకు చెప్పాడా? అని శ్రీధర్ ప్రశ్నించారు.
బాబాసాహెబ్ దళితుల్ని విద్య నేర్చుకొని జ్ఞానవంతులు, విజ్ఞానవంతులుగా మారమని సూచిస్తే.. దళితుల్లో మేధావుల చెప్పుకొనే ఉన్న కొంతమంది కత్తి పద్మారావు, బైరి నరేష్, కత్తి మహేష్, కంచ ఐలయ్య (బీసీ) లాంటి చదువుకున్న అజ్ఞానులుగా మారి సమాజంలో అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న అన్ని కులాల మధ్య ఇప్పటికీ అస్పృశ్యతను,అంటరానితనాన్ని శాశ్వతంగా కొనసాగిస్తున్నారని, వీరికి దళిత జాతి ప్రయోజనాల కన్నా, వీరి రాజకీయ పదవుల స్వార్థం కోసం మాత్రమే వీరు దళిత సమాజంలో స్వయం ప్రకటిత నాయకులుగా చెలామణి అవుతున్నారని విమర్శించారు.
వీరి పట్ల దళిత సమాజం చైతన్యంతో ఉండాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. పేరుకే బ్రాహ్మణ కులం అగ్రకులం గా ఉందని, ఇప్పటికీ బ్రాహ్మణ కులం మీ సమాజంలో బలహీన కులమేనని, బలహీన వర్గమేనని, బలహీనులపై దాడి చేయడమే మీ అంబేద్కరిజమా అని శ్రీధర్ ప్రశ్నించారు. ప్రస్తుత సమాజంలో అగ్రకులలుగా ఉన్న కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, క్షత్రియ కులాలు అన్ని రంగాల్లో పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారని, జూపూడి ప్రభాకర్ లాంటి దళిత నాయకులకు దమ్ముంటే ఆ పెత్తందారులపై పోరాటం చేయాలని, దమ్ముగా రాజ్యాధికారత సాధించాలని, ఈ నాయకులకు అంత దమ్ము లేదని బ్రాహ్మణ సమాజం పూర్తిగా భావిస్తుందని స్పష్టం చేశారు.
ఎందుకంటే వారిని ప్రశ్నిస్తే ఆ పెత్తందారులు వీళ్ళని ఇళ్లకు వచ్చి నరుకుతారని మీకు భయం. మీ కుటుంబ ఖర్చులకు వడ్డీలకు వారు డబ్బులు ఇవ్వరని భావించి భయంతో ఆ పెత్తందారులకు మీరు బానిసలుగా మారి ఊడిగం చేస్తూ రాజకీయ పార్టీల్లో పదవులు తెచ్చుకుంటున్నారని, మీ స్వార్థాల కోసం మీ దళిత జాతిని కూడా ఆ రాజకీయ పార్టీలకి తాకట్టు పెడుతూ.. సభ్య సమాజాన్ని దళిత నాయకుల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఆర్ధికంగా పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
ఇందుకా బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించింది? దళితులకు హక్కులు కల్పించింది, మీ బానిసత్వాన్ని చూసి అంబేద్కర్ ఆత్మ కూడా ఘోషిస్తుందని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వంలో దళితులకు గుండ్లు చేయిస్తే పట్టించుకోరు, అత్యాచారాలు చేస్తే పట్టించుకోరు, భౌతిక దాడులు చేస్తే పట్టించుకోరు, చివరికి దళితుడి నోట్లో ఉచ్చ పోస్తే కూడా పట్టించుకోని మీ దళిత నాయకత్వాలు మీకు ఎందుకని సభ్య సమాజం చర్చించుకుంటుంది. మీ సామాజిక వర్గాలపై జరిగే అన్యాయాలపై నోరు తెరిచి ప్రశ్నించలేని, పోరాడలేని ఈ సోకాల్డ్ బృహన్నల నాయకులు మిగిలిన సామాజిక వర్గాలను ఎలా దూషిస్తారని శ్రీధర్ ప్రశ్నించారు.
జూపూడి ప్రభాకర్ కి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం… నువ్వు తక్షణమే బహిరంగంగా బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో నీ ఇంటి ముందు బ్రాహ్మణ సంఘాలు ధర్నా నిర్వహిస్తారని.. అవసరమైతే జూపూడి ప్రభాకర్ పై భౌతిక దాడి కూడా చేస్తామని శ్రీధర్ హెచ్చరించారు. గతంలోలా బ్రాహ్మణ సమాజంను దూషిస్తే భయపడి ఉండటానికి పాత తరం కాదని ఇదం ఇదం బ్రాహ్మం – ఇదం క్షాత్రం సిద్ధాంతంతో మంత్ర తంత్ర హోమయాగ పూజలతో సైతం తమ శత్రువులను నాశనం చేసే మంత్ర బలాన్ని భగవంతుడు బ్రాహ్మణ సమాజానికి ప్రసాదించాడని గుర్తు చేశారు.
దాని ద్వారానే గతంలో కత్తి పద్మారావు, మంచు మోహన్ బాబు కుటుంబం, కత్తి మహేష్ లపై శత్రు పీడ హోమాలు, క్రతువులు బ్రాహ్మణ పండితులు నిర్వహించారని దాని ద్వారా ప్రస్తుత వారి పరిస్థితి ఏంటో జూపూడి ప్రభాకర్ గ్రహించకపోతే.. నీకు కూడా వారికి పట్టిన దుస్థితే ప్రాప్తిస్తుందని శ్రీధర్ హెచ్చరించారు. ఇప్పుడు ఉన్న బ్రాహ్మణ నాయకులు,బ్రాహ్మణ యువత దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ అంశంపై వైయస్ జగన్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణ సమాజం తగు రీతిలో బుద్ధి చెబుతామని శ్రీధర్ హెచ్చరించారు.