Suryaa.co.in

Telangana

బాల వికాస లాంటి సేవా సంస్థలపై ఐటీ దాడులు అమానుషం

ఖండించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

బాల వికాస పై ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా.గత 25, 30 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాస పై దాడులు బాధాకరం.బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అవడం వల్లే ఈ ఐటీ దాడులు.ఈ ఐటి దాడులు కక్ష్యసాధింపు చర్యలే.లౌకిక, ప్రజా స్వామికి దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోంది.ఇలాంటి దాడులతో బాల వికాస లాంటి సంస్థల నిస్వార్థ ప్రజా సేవలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నది.భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఆ సంస్థ సేవలను అపగలమా?ఎందరో ప్రముఖులు ప్రశంసించిన బాల వికాస సంస్థ పై ఐటీ దాడులు అవమానకరం.

LEAVE A RESPONSE