– వ్యవసాయ రంగంలో సాంకేతికత ద్వారా మార్పులు తీసుకురావాలి
– వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో, పారిశ్రామికవేత్తల అభివృద్ధికి మార్గదర్శనం చేయడానికి ‘వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్’ సంస్థను హైదరాబాద్లో ప్రారంభించుకున్నాం.
ఈ దేశ యువత పరిశోధనలు చేయాలని, తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆకాంక్షిస్తోంది. అలాంటి వారికి సరైన మార్గదర్శనం అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అసెంబ్లీ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తలను తయారు చేయడం అవసరం. వ్యవసాయ రంగంలో సాంకేతికత ద్వారా మార్పులు తీసుకురావాలి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్టార్టప్లను, యువ పారిశ్రామికవేత్తలను బలంగా ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుండి రుణాలు, ఇతర అనుమతుల క్లియరెన్స్ ప్రక్రియలను సులభతరం చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు ప్రేరణ కల్పించేందుకు, శిక్షణ ఇవ్వడానికి ‘వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్’ సంస్థ దోహదమవుతుంది. లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యం.
ఈ సంస్థ కోసం పనిచేసిన అమర్ నాథ్, వారి టీంకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు తమ చదువు పూర్తైన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గొప్ప అవకాశం లభించనుంది.