Suryaa.co.in

Andhra Pradesh

అన్న‌దాత‌ల్ని గ‌ద్ద‌లా త‌న్నుకుపోతున్నాడు జగన్

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

సీఎం సొంత జిల్లాలోనే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.కడప జిల్లా ఖాజీపేట మండలం తుడమలదిన్నెకు చెందిన రైతు వెంకట సుబ్బారెడ్డి అప్పుల బాధ తాళ‌లేక‌, వార‌స‌త్వంగా వ‌చ్చిన భూమి అమ్మ‌కానికి పెట్టాడు. తండ్రి చ‌నిపోవ‌డంతో త‌న‌ పేరుతో భూమి మార్చాల‌ని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా క‌నిక‌రించ‌క‌పోవ‌డంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టం అత్యంత విషాద‌క‌రం.

నేను చనిపోయాక మా భూమికి పట్టా చేసి ఇవ్వండి. అది అమ్మి అప్పులు కడతారు. నేను కోరేది ఇది ఒక్కటే అని సుబ్బారెడ్డి రాసిన మ‌ర‌ణ‌వాంగ్మూల‌మైనా క‌ర‌డుగ‌ట్టిన జ‌గ‌న్ రెడ్డిలో మార్పు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను. అన్న‌దాత‌లారా! చ‌నిపోవ‌డానికి చూపే ధైర్యం బ‌త‌క‌డంలో చూపండి. ఒక్క ఏడాది ఓపిక ప‌ట్టండి.

అంద‌రి చంద్ర‌న్న ప్ర‌భుత్వం వ‌స్తుంది. మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే బాధ్య‌త మాది. ఒక సోదరుడిగా మిమ్మ‌ల్ని వేడుకుంటున్నాను. అరాచ‌క ప్ర‌భుత్వం, వ్య‌వ‌స్థ‌ల‌ మీద కోపంతో ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డొద్దు. మీ కుటుంబాల‌కి అన్యాయం చేయొద్దు.

LEAVE A RESPONSE