Suryaa.co.in

Telangana

ఏపీలో జగన్‌దే గెలుపు

-తెలంగాణలో కాంగ్రెస్‌కు వచ్చేది ఒక్కటే
– నల్గొండలో మాత్రమే గెలుస్తున్నారు
– నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కగా గెలుస్తున్నాం
– సిరిసిల్లలో ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదు
– మీడియాతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం, వైసీపీ అధినేత జగన్ గెలుస్తున్నాడని సమాచారం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందని అన్నారు. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు.

మీడియాతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..

‘‘కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు కరెక్ట్‌గా లే రు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కగా గెలుస్తున్నాం. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉం ది . కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్‌ను చూసి కాంగ్రెస్ , బీజేపీ భయపడ్డాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉం ది .

సిరిసిల్లలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదు. కావాలంటే మీరు వెళ్లి సిరిసిల్లలో ఓటర్లను మైకులు పెట్టి అడగండి. సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్‌గిరికి ఏమన్నా సంబంధం ఉందా? ఆమె అక్కడ కాంగ్రెస్ కాండేట్ ఏంది?

బండి సంజయ్‌ని గెలిపించాలని అడ్రస్ లేనివారికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వెలిచాల రాజేశ్వరరావు ఎవరు? నాగర్ కర్నూల్‌లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి, మిగతా ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటన తర్వాత పూర్తిగా సమీకరణాలు మారిపోయాయి. ఖమ్మంలో నామా నాగేశ్వర్ రావుని కమ్మ సామాజికవర్గం గెలిపించుకుంటున్నారు’’.

LEAVE A RESPONSE