Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీలో చేరికల పర్వం

– బిజెపి లో చేరిన వ్యాపార వేత్త, సినీ నిర్మాత వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు, సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అధినేత, తెలుగు దేశం సీనియర్ నేత అశోక్ రాజు
– కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ: బిజెపి లో చేరిక లో పర్వం జోరు అందుకుంది… ఎటువంటి హామీ తీసుకోకుండా పార్టీ లో చేరే వారి సంఖ్య పెరిగింది. రాష్ట్ర కార్యాలయం లో సినీ రంగం, విద్యారంగం, న్యాయ వాదులు,రైతు నాయకులు పార్టీ లో చేరారు. చిత్తూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన నేతలు పార్టీ లో చేరారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం రెండు‌ కళ్లుగా మోడీ దేశాన్ని నడిపిస్తున్నారు. అనేక మంది బిజెపి లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కొత్తగా పార్టీ లోకి వచ్చే వారు… మోడీ పధకాలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బిజెపి లో చేరిక లతో పార్టీ మరింత బలపడి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు.

సభా కార్యక్రమం బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం నిర్వహించారు. బిజెపి లో సాఫ్ట్వేర్ సంస్థ అధినేత కె సుధీర్, సిహె నర్శిం హ మూర్తి, ఆర్ట్ ప్రొడ్యూసర్ బండి శ్రీ నివాస్ రావు, టీ శ్రీ నివాస్ రావు తదితరులు పార్టీ లో చేరినట్లు బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ప్రకటించారు. తొలుత బిజెపి లో చేరినందుకు ప్రమాణం చేశారు.

LEAVE A RESPONSE