సూర్యాపేట: ఓటమి తర్వాత తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలీసులు ఆపి తనిఖీ చేశారు. బస్సు లోపల ఉన్న సొరుగులు, తలుపులు తనిఖీ చేశారు. ఈదులపర్రా తండా చెక్పోస్టు వద్ద ఈ తనిఖీలు నిర్వహించారు. వారికి బస్సులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారు.