Suryaa.co.in

Telangana

తుంగతుర్తిలో రైతులను పరామర్శించిన కేసీఆర్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (M) వెలుగుపల్లి గ్రామ శివారు లోని 365 జాతీయ రహదారి పక్కన ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన వరి పొలాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పాల్గొన్నారు..

LEAVE A RESPONSE